ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ కు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన రాతలు,చర్యలు,ట్వీట్లు ఉండడమే కారణం.ఈమేరకు ఆయనపై పలుచోట్ల కేసులు
నమోదైన సంగతి తెలిసిందే. రెండేళ్లనాటి ఓ కేసులో జుబైర్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే హిందువులు,ముస్లింలపై కేసుల విషయంగా కోర్టులు ఎంతటి వ్యత్యాసం చూపుతున్నాయో మరోసారి రుజువైంది. బెయిల్ మంజూరు చేస్తూ హిందువులు సహనంగా ఉండాలన్నట్టు కోర్టు తీరు ఉంది. ఇలాంటి కేసులోనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను దేశప్రజలు ఇంకా మరిచిపోలేదు.
https://twitter.com/LawBeatInd/status/1547865002383515650?s=20&t=Ag40EF-7hjpy1G-twkDNIg
హిందూ ఫోబిక్ పోస్టులపై కోర్టు కనీసం ఒక్కమాటా అనకుండా… ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాల స్వరం అవసరం,అందువల్ల రాజకీయ పార్టీల విమర్శల పై ఐపీసీ సెక్షన్ 153A , 295Aని అమలును సమర్థించలేం అని ఆశ్చర్యపరిచే ప్రకటన చేసింది. జుబైర్ పై నమోదైన ఎఫ్ఐఆర్లో ఏ రాజకీయాల ప్రస్తావనే లేదు. అంటే హిందువులు మాత్రమే సహనం కలిగి ఉండాలన్నమాట. హిందుదేవుళ్లను ఎవరైనా అనుమానిస్తే అభ్యంతరం చెప్పకూడదన్నమాట. హిందూ మతం పురాతన మతం, అత్యంత సహనశీలమైనది కూడా…ఆ మతాన్ని అనుసరించేవారు చాలా సహనంగా ఉంటారని వ్యాఖ్యానించిన కోర్టు వాళ్లు తమ దేవుళ్లపేర్లను కంపెనీలకు , సంస్థలకు పెడతారనీ ప్రస్తావించింది.
జుబైర్ హనీమూన్ హోటల్ అంటూ వివాదాస్పద ట్వీట్ చేశాడు. అయితే అది ఓ కామెడీ అని..హిందూమతంలో హనుమాన్ తప్ప హనీమూన్ అనే దేవుడే లేడని ప్రాసిక్యూషన్ వాదించాడు. అసలైతే జుబైర్ కావాలనే హనుమాన్ పేరును హనీమూన్ గా మార్చాడు. ఒక నిర్దిష్ట మత సమాజానికి వ్యతిరేకంగా, వారిని రెచ్చగొట్టేలా ఆయన జత చేసిన చిత్రం, ఆ పదాలు ఉన్నాయి. సమాజంలో మత ప్రశాంతతను దెబ్బతీసేలా వ్యక్తుల మధ్యద్వేషభావన పెంచేలా ఆయన తీరు ఉందని ఎఫ్ఐఆర్లో ఉంది.
సరే జుబైర్ హిందుత్వను అవమానించాడా లేదా అన్నది విచారణ తరువాత న్యాయస్థానం నిర్ధారిస్తుంది. అయితే పటియాలా హౌస్ కోర్టు హిందూమతంపై చేసిన వ్యాఖ్యలు….నూపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు
చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇస్లాం మతాన్ని అవమానించారంటూ
కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఇస్లాంవాదుల హింసను సమర్థించింది. ఖురాన్లోని కోట్స్ ను ప్రస్తావించినందుకు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే అన్ని కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించిన సందర్భంలో సుప్రీం ఆమెను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఆమె అభ్యర్థనను తిరస్కరించిన జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ జెబి పార్దివాలాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెపై తీవ్రంగా మండిపడింది. ఉదయ్ పూర్ కన్నయ్యలాల్ హత్యకుకారణం ఆమె చేసిన వ్యాఖ్యలేననీ అంది.
నూపుర్ తన మాటతో దేశంలో చిచ్చుపెట్టారని..దేశప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలనీ అంది.