ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ తో పాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరుచేసింది కోర్ట్. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్డు.. 50 వేల రూపాయల పూచీకత్తుపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేశారు. ఇప్పటికే మరో ఇద్దరు నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిపై సీబీఐ నమోదు చేసిన కేసులో ట్రయల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది