మనీలాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. బెయిలు దరఖాస్తుపై రౌత్, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు అక్టోబర్ 21న తీర్పు రిజర్వ్ చేసింది.
ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీ రీడవలప్మెంట్ వ్యవహారంలో అవకతవకల ఆరోపణలకు సంబంధించి సంజయ్ రౌత్ను గత ఆగస్టు 1న ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అంతకుముందు ఆయన రెండుసార్లు ఈడీ విచారణకు గైర్హాజయ్యారు. తమపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని సంజయ్ ఆరోపిస్తున్నారు. శివసేన మాదంటే మాదేనంటూ ఉద్ధవ్, ఏక్నాథ్ మధ్య పోరు జరుగుతున్న క్రమంలో రౌత్ ను ఈడీ అరెస్ట్ చేసింది.