గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీకి బెయిల్ లభించింది. ప్రధానిపై అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారన్నా ఫిర్యాదుతో ఆయనని అరెస్ట్ చేసి గువాహటికి తెచ్చిన పోలీసులు అక్కడి నుంచి తరలిస్తుండగా మహిళా పోలీసు అధికారిని వేధించారని రెండో కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ 26న జిగ్నేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా బార్పేట చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముకుల్ చెతియా.. బెయిల్ నిరాకరించి ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. ఏప్రిల్ 28న మరోసారి బెయిల్ పిటిషన్ను దాఖలు చేయగా, వాదనలు విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. 29న బెయిల్ మంజూరు చేసింది. రూ. 1,000 వ్యక్తిగత బాండ్పై కోర్టు బెయిల్ ఇచ్చిందని మేవానీ తరపు న్యాయవాది అంగ్షుమన్ బోరా తెలిపారు.