JNU విద్యార్థి నేత షార్జిల్ ఇమామ్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాలతోనే 2019లో ఢిల్లీలో హింస చెలరేగిందనే ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతనిపై రాజద్రోహం కేసు పెట్టారు. జామియామిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు సీసీఏకు వ్యతిరేకంగా 2019 డిసెంబర్లో ప్రదర్శన నిర్వహించారు. ఆ ఆందోళనల సందర్భంగా రోడ్డును దిగ్బంధించి…వాహనాల్ని ధ్వంసం చేశారు. అంతకు రెండురోజుల ముందు.. అంటే డిసెంబర్ 13న ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే దుండగులు హింసకు పాల్పడినట్టు నిర్థారణ అయింది. నాటినుంచి షర్జీల్ 31 నెలలుగా షార్జిల్ కస్టడీలోనే ఉన్నాడు. అయితే 2019నాటి రాజద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్ మంజూరైనా ఆయన ఇంకా కస్టడీలోనే ఉంటారు. షర్జీల్ పై నమోదైన ఇతర కేసులింకా పెండింగ్ లోనే ఉన్నాయి.
https://twitter.com/ANI/status/1575736773602222081?s=20&t=6G_YxtxTLPGJ4tD4TLufFw
దాదాపు రెండున్నరేళ్లుగాకస్టడీలోనే ఉన్నానని..తనకు బెయిల్ ఇవ్వాలని షర్జీల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ పరిశీలించాలని… ట్రయల్ కోర్టును ఆదేశించింది. గతంలో ఆయనకు రెగ్యులర్ బెయిలు ఇచ్చేందుకు 2021 అక్టోబరులో సాకేత్ కోర్టు తిరస్కరించింది. ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు సమాజంలో అశాంతిని రేకెత్తుస్తున్నాయని తెలిపింది.