[దేశానికి స్వాతంత్రం వచ్చి 2022 AUG 15 కి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో దేశ వ్యాప్తంగా 75 వారాలు 75 ప్రదేశాలలో పెద్దఎత్తున కార్యక్రమాలు జరగనున్నాయి. దానిలో భాగంగా ఈరోజు[12.3.2021] గుజరాత్ లోని సబర్మతిఆశ్రమం లో లాంఛనంగా దండి యాత్ర ప్రారంభమైనది . గాంధీజీప్రారంభించిన సబర్మతి ఆశ్రమము నుండి సరిగ్గా ఇదే రోజు 1930 వసంవత్సరంలో దండి సత్యాగ్రహ యాత్ర మొదలయింది.]
గుజరాత్ ప్రాంతంలో లో అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం నుండి ఆ రాష్ట్ర తీర ప్రాంతంలోని దండి గ్రామం వరకు 1930 మార్చి 12 నుండి 24 రోజులపాటు దండి సత్యగ్రహ యాత్ర సాగింది యాత్రకు మహాత్మా గాంధీజీ నాయకత్వం వహించారు. 81 మంది వాలంటీర్లతోయాత్ర మొదలయింది మార్గంలో వేలాది మంది చేరారు.ఉప్పు ఉత్పత్తిపై బ్రిటిష్ గుత్తాధిపత్యానికి , ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమంసాగింది. స్వాతంత్ర పోరాటం లో ఇది ఒక కీలకమైన ఘట్టం.
భారతదేశంలో బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా సాగిన దండి సత్యాగ్రహం దేశం లో ప్రకంపనలు సృష్టించినది. . 1930 మార్చి 12 న ప్రారంభమైన దండియాత్ర 24 రోజులు సాగి ఏప్రిల్ 6, 1930 న ముగిసింది. ఈ యాత్ర సబర్మతి ఆశ్రమం నుండి 4 జిల్లాలు మరియు 48 గ్రామాల గుండా 386 కిలోమీటర్లుదూరం లోని దండిగ్రామం వరకు సాగింది. గాంధీ జీ దండి సముద్ర తీరంలో ఉప్పును ఉత్పత్తి చేయడం ద్వారా బ్రిటిష్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణం అరెస్ట్ చేయబడ్డారు. ఈ యాత్రకు విస్తృతమైన మీడియా కవరేజ్ వచ్చింది భారతస్వాతంత్ర్యపోరాటం ప్రపంచమంతటికి తెలిసింది. ఈ ఉద్యమం దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది .ఆ సమయంలో దాదాపు 60,000 మంది భారతీయులు జైలు శిక్ష అనుభవించారుదీని కొనసాగింపుగా బ్రటిష్ నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలకు తేర లేచింది
ప్రారంభ మైన ఆ చారిత్రక యాత్రను తలపించే యాత్ర
ఆ చారిత్రక యాత్రను తలపించే విధంగా ఈ రోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర చేపట్టిన అనేక మంది అహ్మదాబాద్లోని అభయ్ ఘాట్ చేరుకున్నారు. సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ.. దండియాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
. . ఆత్మనిర్భరత పట్ల భారతీయుల్లో మరింత స్ఫూర్తిని రగిలించడంలో దండియాత్ర కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ‘వోకల్ ఫర్ లోకల్’ ద్వారా మహాత్మునితో పాటు స్వాతంత్ర్య సమర యోధులకు గొప్ప నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని మోదీ కోరారు. సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాటు చేసే ఛరఖాలో ఆత్మనిర్భరతకు సంబంధించిన ట్వీట్లను జోడించనున్నట్లు చెప్పారు. ఇది ప్రజల ఉద్యమానికి హేతువుగా నిలుస్తుందన్నారు.: . దండి యాత్ర 91వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాదయాత్ర కార్యక్రమానికి ప్రధాని శ్రీకారం చుట్టారు శుక్రవారం ఉదయం సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమయిన ఈ యాత్ర.. 241 మైళ్ల దూరంలోని దండి వరకు సాగనుంది. 25 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ఏప్రిల్ 5న దండిలో యాత్ర ముగుస్తుంది. దేశ ప్రజలను ఏకం చేసిన మహాత్ముడి స్ఫూర్తితో ఈ పాదయాత్ర జరగనున్నది .ప్రధాని మోదీ.. పాదయాత్రను ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రదర్శనల్లో దండి యాత్ర, మహాత్మ గాంధీ, నేతాజీ, సర్దార్ పటేల్ సహా ఉద్యమ నాయకుల త్యాగాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.అప్పటి యాత్రను తలపించేలాఉప్పు తయారీపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ 1930 మార్చి 12న దండి యాత్ర ప్రారంభించారు. 81 మంది వ్యక్తులతో సబర్మతి నుంచి దండి వరకు కాలినడకన ప్రయాణించారు. ఏప్రిల్ 5న ఈ యాత్ర ముగిసింది. ఇదే స్పూర్తితో.. మోదీ ప్రారంభించే యాత్ర 24 రోజుల పాటు కొనసాగనుంది.
విభిన్న రూపాల్లోఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు
విభిన్న రూపాల్లోఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు దేశవ్యాప్తంగా 2022 స్వాతంత్ర్య దినోత్సవం వరకు విభిన్న రూపాల్లో జరగనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని ప్రదర్శనలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు, వర్చువల్ సమావేశాలు జరగనున్నాయి. స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఊరురా నిర్వహించనున్నారు.. ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉండాలని సూచించారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఐదు రకాలుగా విభజించారు. 75 ఏళ్లలో భారత్ ఆలోచనలు, సాధించిన విజయాలు, తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పరిష్కరించిన సమస్యలపై పలు రూపాల్లో 75 వారాల పాటు చర్చించనున్నారు.సనాతన భారత్ నుంచి ఆధునిక భారత్గా ఆవిర్భవించిన తీరును విశ్లేషించనున్నారు. శాస్త్రవేత్తల విజయాలను కీర్తించనున్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్ర్యపు ఉద్యమంలో వెలుగు చూడని వీరుల గాధలు, మహిళా స్వాతంత్ర్య సమరయోధులు, ఈశాన్య భారత పోరాటాలు, ఎర్రకోటలో భారత జాతీయ ఆర్మీ రైలు, స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికల పాత్ర వంటి అంశాలపై ప్రచురణలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు కేంద్రం తెలిపింది.