ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు ఖరారు అయింది. జూన్ నెల 24వ తేదీ నుంచి జరిగే మొట్టమొదటి సమావేశాల్లోనే సభాధ్యక్షునిగా అయ్యన్నపాత్రుడు ఎన్నిక అవుతారు. తెలుగుదేశం కూటమికి తిరుగులేని మెజార్టీ ఉంది కాబట్టి ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే.
స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంపిక వెనక చాలా కసరత్తు జరిగింది. నిజానికి అయ్యన్నపాత్రుడు ఇప్పటి నాయకుడు కాదు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన మొదటి తరం తెలుగుదేశం నాయకుడు. 1983 85ల్లో రెండుసార్లు నర్సీపట్నం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించారు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గం వెలమ కులానికి చెందిన నాయకుడు. నక్సలైట్ల నుంచి తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ నర్సీపట్నం నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు గ్రామాల్లో రోడ్లు వేయించినప్పుడు నక్సలైట్లు నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు ఒకసారి అయ్యన్న నివాసం మీద నక్సలైట్లు దాడి చేసి ,, అప్పుడు ఆయన లేకపోవడంతో
.. ఆయన పోలికలతో ఉండే అయ్యన్నపాత్రుడు తమ్ముడిని చంపేశారు. దీంతో నివాసాన్ని విశాఖపట్నం కు మార్చుకొని ,, అక్కడి నుంచి క్రమం తప్పకుండా నర్సీపట్నం వెళ్లి వస్తుంటారు.
1994, 99, 2004లో మరో మూడు సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. పార్టీ ఆదేశాల మేరకు మధ్యలో ఒకసారి అనకాపల్లి పార్లమెంటు సభ్యునిగా సేవలు అందించారు.
ఇదంతా ఒక ఎత్తైతే గడచిన
40 సంవత్సరాలుగా .. తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడుగా నిలుస్తూ వచ్చారు. పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పట్టించుకోకుండా.. పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూ వచ్చారు. 2004 09 మధ్యకాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అప్పటి వైయస్సార్ ప్రభుత్వం మీద పోరాటం చేశారు. 2014 19 మధ్యకాలంలో తెలుగుదేశం తరఫున మరోసారి మంత్రిగా వ్యవహరించారు.
2019 నుంచి 24 దాకా తెలుగుదేశం పార్టీకి చాలా క్లిష్టమైన సమయం అనుకోవచ్చు వైయస్ జగన్ ప్రభుత్వం నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారు ఎదురు తిరిగిన వారందరి మీద పోలీసు కేసులు పడ్డాయి. ఆ భయంతో చాలామంది తెలుగుదేశం నాయకులు ఇంటికే పరిమితం అయ్యారు మైకులు కట్టేశారు అయినప్పటికీ మాత్రం అయ్యన్నపాత్రుడు మాత్రం ఎక్కడా బెదర లేదు అదరలేదు. ఇంటి దగ్గర నుంచి వీడియోలు తయారుచేసి మీడియాకి పంపించేవారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడంలో అయ్యన్నపాత్రుడు ముందు ఉండేవారు ముఖ్యంగా విశాఖపట్నంలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తోటి డి అంటే డి అన్నట్లుగా పోరాటం చేశారు ఈ క్రమంలో ఆయన మీద అనేక కేసులు పడ్డాయి కొన్నిసార్లు అరెస్టు చేసేటందుకు పోలీసుల ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు ప్రతిపక్షంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయారు అటువంటి వారిపట్ల అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేసేవారు.
మరోవైపు అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ పాత్రుడు కూడా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా నారా లోకేష్ టీం లో కీలక నాయకుడిగా ఉన్నారు అనకాపల్లి ఎంపీ స్థానాన్ని పాత్రుడు ఆశించారు కానీ పొత్తుల్లో భాగంగా దానిని బిజెపికి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అయ్యన్నపాత్రుడు వర్గానికి నిరాశ ఎదురైంది.
ఈలోగా మొన్నటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం విజయం సాధించింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఖచ్చితంగా అయ్యన్ప పాత్రుడుకి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ యువ నాయకుల్ని ప్రోత్సహించాలి అన్న పార్టీ విధానంలో భాగంగా.. అవకాశం కల్పించలేదు. దీంతో ఆయన పాత్రుడు వర్గంలో మరింత నిరాశ ఎదురయింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా బలమైన తెలుగుదేశం నాయకుడిని కూర్చోబెట్టాలని పార్టీ అధిష్టానం తలపోస్తోంది. ఈ క్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనంతపురం జిల్లాకు చెందిన కాల్వ శ్రీనివాసులు వంటి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ అందరిలోనూ అయ్యన్నపాత్రుడు సీనియర్ మాత్రమే కాకుండా వైసిపి మీద తీవ్ర ఆగ్రహం కురిపించే నాయకుడిగా నిలుస్తారు. అదే సమయంలో పార్టీ విధానాల మీద మాత్రమే విమర్శలు గుప్పించడం ద్వారా హుందాతనం కలిగిన నాయకుడిగా పేరు ఉంది. దీంతో చింతకాయల అయ్యన్నపాత్రుడు కి స్పీకర్ పదవి ఇవ్వడానికి మార్గం సుగమం అయింది అని తెలుస్తోంది.