ఉత్తరప్రదేశ్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయోధ్యలోని సరయూ తీరాన జరిగిన దీపోత్సవంలో పాల్గొన్నారు. అయోధ్య రాముడి సందేశం, పాలన ద్వారా పొందిన విలువలే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ కు స్ఫూర్తి అని అన్నారు. అయోధ్య పర్యటనలో భాగంగా ఆలయ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అక్కడ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో పర్యటించారు. దీపోత్సవంలో భాగంగా సరయూతీరంలో 15 లక్షల దీపాలు వెలిగించారు. అయోధ్యలోని ముఖ్య ప్రదేశాలు, ప్రముఖ కూడళ్లలో మరికొన్ని ప్రమిదలనూ వెలిగించారు. దీపావళి వేళ అయోధ్యాపురి కాంతులీనుతోంది.