కరెన్సీ కాయిన్స్తో అయోధ్య రామమందిరం
అయోధ్య రామాలయాన్ని కరెన్సీ కాయిన్స్తో తీర్చిదిద్దారు కర్ణాటకకు చెందిన కళాకారులు. రాష్ట్ర ధర్మ ట్రస్ట్ వారికి వచ్చిన ఆలోచనను.. ఓ కళాకారుడు అద్భుతంగా ఆవిష్కరించాడు. మొత్తం 60 వేల కాయిన్స్ను ఇందుకోసం ఉపయోగించారడు.రూ.1,రూ.5 నాణేలతో అచ్చం అయోధ్య రామమందిరాన్ని గుర్తుచేసుకునేలా తీర్పిదిద్దాడు. ఈ మందిర నిర్మాణ రూపానికి మొత్తం రూ.2లక్షల రూపాయల విలువచేసే కాయిన్స్ను ఉపయోగించినట్లు కళాకారుడు వెల్లడించాడు. ఈ రామ మందిర రూపాన్ని బెంగళూరులోని లాల్బాగ్ వెస్ట్గేట్ వద్ద ప్రదర్శనుకు ఉంచారు. చూపరులకు ఈ మందిర నిర్మాణం ఆకట్టుకుంటుంది.