అయోధ్యలో భవ్యమందిర నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయ నిర్మాణానికి సంబంధించిన గర్భగుడి పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.
మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహించారు. యోగీతో పాటు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, రామ్ మందిర్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా పాల్గొన్నారు. గర్భాలయం నిర్మాణం కోసం రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా బన్సీ పహర్ పూర్ నుంచి శాండ్ స్టోన్ తెప్పించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులను తెలియజేసే ఒక పుస్తకాన్ని యోగి ఆవిష్కరించారు.