అయోధ్యలో రామమందిర నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా మందిర నిర్మాణం పూర్తికానుంది.ఇప్పటికీ సగం పనులు పూర్తి అయ్యాయంటూ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. నిర్మాణం పూర్తైన అనంతరం, విగ్రహాల ప్రతిష్టాపన తరువాత 2024 మకరసంక్రాంతి నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని ఇప్పటికే ట్రస్ట్ తెలిపింది. భారతీయులనుంచి, రామభక్తులనుంచి వసూలు చేసిన నిధితోనే ఆలయ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ వ్యయాన్ని వెయ్యికోట్లుగా అంచనా వేశారు. ప్రధాన ఆలయం తో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్స్ పరిశోధనా కేంద్రం ఉంటాయి. ఆలయ పరిసరాల పరిధినీ 67 ఎకరాలనుంచి 110 ఎకరాలకు పెంచినట్టు గతంలోనే ఆలయ ట్రస్ట్ ప్రకటించింది.
More Photos :