అయోధ్య…
రాముడు పుట్టిన నేల, మన దేవుడు నడయాడిన నేల..
రామరాజ్యంగా ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందిక్కడే..
అసలు అయోధ్య పేరుకు అర్థమే యుద్ధం లేని అని.
అవును అయోధ్యానగరం ఎంత ప్రశాంతంగా ఉండేది మరి…
సామరస్యానికి ప్రతీకగా, శాంతికి చిహ్నంగా.. భిన్న సంస్కృతుల సమాహారం కదా నాటి అయోధ్య..
సరయూ తీరాన దినదినప్రవర్థమానమైంది..
వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యాధారంగా నిలిచింది, నిలుస్తోంది..
కోసల రాజ్య రాజధానిగా అనేక రాజవంశాల ఎదుగుదలకు,పతనాన్నీ చూసింది..
అయోధ్య చరిత్ర, అయోధ్య వర్తమానం, అయోధ్య భవిష్యత్ కూడా..
తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకు, తండ్రి పట్ల విధేయత చాటుకునేందుకు రామయ్య నాడు పధ్నాలుగేళ్లు ఈ నగరానికి దూరమయ్యాడు..
పధ్నాలుగేళ్ల వనవాసం తరువాత వచ్చిన రామచంద్రుడిని మళ్లీ ఒడిన చేర్చుకుందీ అపురూపనగరం..
రామపట్టాభిషేకాన్ని చూసి పులకించిపోయింది అయోధ్యనేలంతా…
ఇక్కడ శతాబ్దాలుగా సరయూ నది ఆనందంగా పరవశిస్తోంది..
హైందవమే కాదు.. బౌద్ధం, జైనం విలసిల్లాయిక్కడ
నదీ తీరాన 11 ఘాట్లున్నాయి… గుప్త్వార్ ఘాట్, కైకేయి ఘాట్, కౌసల్య ఘాట్, పాపమోచన్ ఘాట్, లక్ష్మణ్ ఘాట్…ప్రతీఘాట్ కూ ఓ దివ్యకథ.
ఇక్ష్వాకు వంశపు, సూర్యవంశపు రాజుల రాజధాని ఇది. పురాణాల్లో ‘అష్ట చక్రా నవద్వారా దేవానాం పురయోధ్యా’ అంటూ దేవనగరంగా అభివర్ణించారు దీన్ని.
శ్రీరాముడి ప్రియ భక్తుడు హనుమంతుడి పేర నిర్మించిన ఆలయం హనుమాన్ గఢీ ఎంతో ప్రసిద్ధమైనది.
ఇంకా రామ్ లాలా, హనుమంత్ లాల్, నాగేశ్వరనాథ్ వంటి పుణ్యక్షేత్రాలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి.
జైన, బౌద్ధ, సిక్కు , సూఫీ సంప్రదాయాలు, సనాతన సాంస్కృతిక మూలాలున్నాయి. జైనమత స్థాపకుడు రాజు రిషబ్ దేవ్ అయోధ్య రాచకుటుంబీకుడే..
5వేల నాటి మొదటి తీర్థంకరుడికి సంబంధించిన ఆనవాళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయి…
రాయ్ గంజ్ , కత్రాల్లో తీర్థంకరుడి మందిరం, భారీ విగ్రహం ఉన్నాయి…
అయోధ్యను అజిత్ నాథ్, అభినందనాథ్, సుమతి నాథ్, అనంతనాథ్ తీర్థంకరుల నేలగా కూడా చెబుతారు…
బౌద్ధ సంప్రదాయంలో కూడా అయోధ్య స్థానం ముఖ్యమైనది…
జ్ఞానోదయం పొందిన తరువాత 16 ఏళ్లు అయోధ్యలోనే ఉన్నాడని బౌద్ధగ్రంథం దీపావంశ్ చెబుతోంది.
అశ్వఘోషుడు అయోధ్యనుంచే మహాయాన శాఖను విస్తరించినట్టూ చారిత్రక ఆధారాలున్నాయి….
మొదటి, తొమ్మిదో, పదో సిక్కు గురువులు ఎప్పటికప్పుడు రామనగరి అయోధ్యను తరచూ సందర్శించేవారు..
గురునానక్ కూడా ప్రహ్లాద్ ఘాట్ దగ్గర పలుమార్లు బస చేశాట్ట..
గురుద్వారా బ్రహ్మకుండ్, గురుగ్వారా గోవింద్ ధామ్ లు సిక్కుల పూజనీయస్థలాలు. ఇన్నింటి కలబోత అప్పుడు రాముడు ఏలిన రాజ్యం..
ఇక కవి తులసీ దాస్ ఇక్కడి తులసీ చౌరాలో ఉండి రామ్ చరిత్ మానస్ ను ఆవిష్కరించాడు…
ఏడో శతాబ్దంలో చైనా యాంత్రికుడు హెన్ స్తసంగ్ కు వచ్చి…అయోధ్య గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు…
ప్రధాన కనక భవన్, దశరథ్ మహల్ ఉన్నాయి. కనక మహల్ ను కైకేయి…సీతమ్మకు బహుమతిగా ఇచ్చారని చెబుతారు. ఎత్తైన మట్టి దిబ్బపై ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా హనుమాన్ గడీ ఉంటుంది. సరయూ సమీపంలో ఉన్న నాగేశ్వర్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది…
తన ఈ జన్మభూమిని స్వర్గంతో పోల్చాడు మనదేవుడు రాముడు..
స్వర్ణభూమి లంకలోనే ఉండిపోదామన్న సోదరుడితో జననీ జన్మభూమిశ్చ …స్వర్గాదపీ గరీయసి అన్నాడు. సరయూ తీరం నా జన్మభూమి. నేను ఇక్కడే పెరిగాను. నా జన్మభూమే నాకు స్వర్గం అనీ అన్నాడు రామయ్య..
కాలగమనంలో ఎన్నో మార్పులు…
ఇవాళ మళ్లీ చారిత్రక రాచనగరి అయోధ్య పులకరిస్తోంది…
రాముడు ఏలిన రాజ్యం ఇక ఎప్పటికీ ప్రశాంతంగా ఉండాలని ఈ అయోధ్యాపురి ఆకాంక్షిస్తోంది.
అయోధ్య రాముడి జన్మభూమి అయితే మనందరి కర్మభూమి..