అద్భుతం.. మోడీతోనే సాధ్యం
కరోనా వైరస మహమ్మారి చైనాలో బయటపడిన సమయానికి భారతదేశంలో పర్సనల్ ప్రొటెక్క్షన్ ఎక్విప్ మెంట్ (పిపిఇ) కిట్ల కోసం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడేది. కరోనా చికిత్స చేసే వైద్య సిబ్బందికి, ఇతరులకు పిపిఇ కిట్లు కావాల్సిన దశలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించారు. దాని ఫలితం ఎంతో ఘనంగా ఉంది. ఇప్పుడు పిపిఇ కిట్స్ ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలోనే రెండో ర్యాంకు సాధించింది.
మన దేశంలో దాదాపు 1100 సర్టిఫైడ్ కంపెనీలు రోజుకు 4.5 లక్షల పిపిఇ కిట్లను తయారు చేస్తున్నాయి. ఈరోజు భారత్ లో పిపిఇ కిట్స్ పరిశ్రమ విలువ సుమారు 7000 కోట్ల రూపాయలు.
విదేశాల నుంచి దిగుమతి స్థాయినుంచి అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి నవ భారతం ఎదిగింది. మోడీ సంకల్పించిన న్యూ ఇండియా సాకారం అవుతున్న సానుకూల సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా కట్టడికి అత్యంత సమర్థంగా పనిచేసిన దేశాధినేతగా ఇప్పటికే మోడీ ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. దటీజ్ చౌకీదార్.
ప్రజాదరణలో తిరుగులేని మోడీ
ఓటు బ్యాంకు రాజకీయాలకు టాటా చెప్పి, నిజమైన చౌకీదార్ గా పని చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రజలు గుండెల్లో గుడి కట్టారు. ఆయన్ని అద్భుతమైన నాయకుడిగా అభిమానిస్తున్నారు. మోడీ ప్రజాదరణ 75 శాతం. ప్రపంచ నేతల్లో ఇంకెవరికీ సాధ్యం కాని ఘనత ఇది. అమెరికా డేటా సంస్థ మార్నంగ్ కన్సల్ట్ సర్వేలో అన్ని దేశాల అధినేతల్లో మోడీ నంబర్ వన్ అని రుజువైంది. అభివృద్ధి, చిత్తుశుద్ధి, కరోనా వైరస్ కట్టడి, వ్యాక్సిన్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు తదితర విషయాల్లో మోడీ పనితీరు అద్భుతం అన్నారు ప్రజలు.
ఇక దేశాధినేతల ప్రజాదరణ, లేదా అప్రూవల్ రేటింగ్ విషయానికి వస్తే, ఎవరికీ అందనంత ఎత్తులో నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయనకు 75 శాతం మద్దతు లభించింది. మెక్సికో అధ్యక్షుడు ఎఎంఎల్ ఒబ్రదోర్ 62 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ 59 శాతం మద్దతు పొంది మూడో ర్యాంకు సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో గ్యుసెప్ కోంటె, జస్టిన్ ట్రుడో, జైర్ బొల్సనారో బూన్ జే ఇన్, డోనాల్డ్ ట్రంప్, బోరిస్ జాన్సన్ ఉన్నారు.
కరోనా వైరస్ కట్టడిలో విఫలమయ్యారని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ అప్రూవల్ రేటింగ్స్ లో ఆయనకు టాప్ 10లో చోటు దక్కింది. ట్రంప్ 40 శాతంతో 9వ ర్యాంకు పొందారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ 38 శాతంతో 10వ స్థానంలో నిలిచారు. ఈ సర్వే వివరాలు వెల్లడి కాగానే కమలనాథులు సంతోషంతో కేరింతలు కొట్టారు. మోడీపై అభినందనల చందనం కురిపించారు. మన దేశ ప్రధాన మంత్రి వరల్డ్ నంబర్ వన్ అని ఒక సర్వేలో తేలినా ప్రతిపక్ష నేతలు ఎవరూ అభినందనలు తెలిపిన దాఖలాలు లేవు.
అలాగే…
కరోనా వైరస్ మహమ్మారి చైనాలో బయటపడిన సమయానికి భారతదేశంలో పర్సనల్ ప్రొటెక్క్షన్ ఎక్విప్ మెంట్ (పిపిఇ) కిట్ల కోసం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడేది. కరోనా చికిత్స చేసే వైద్య సిబ్బందికి, ఇతరులకు పిపిఇ కిట్లు కావాల్సిన దశలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించారు. దాని ఫలితం ఎంతో ఘనంగా ఉంది. ఇప్పుడు పిపిఇ కిట్స్ ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలోనే రెండో ర్యాంకు సాధించింది.
మన దేశంలో దాదాపు 1100 సర్టిఫైడ్ కంపెనీలు రోజుకు 4.5 లక్షల పిపిఇ కిట్లను తయారు చేస్తున్నాయి. ఈరోజు భారత్ లో పిపిఇ కిట్స్ పరిశ్రమ విలువ సుమారు 7000 కోట్ల రూపాయలు.
విదేశాల నుంచి దిగుమతి స్థాయినుంచి అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి నవ భారతం ఎదిగింది. మోడీ సంకల్పించిన న్యూ ఇండియా సాకారం అవుతున్న సానుకూల సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా కట్టడికి అత్యంత సమర్థంగా పనిచేసిన దేశాధినేతగా ఇప్పటికే మోడీ ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. దటీజ్ చౌకీదార్.