వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ని విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది బృందం.అసలైతే పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఇవాళ విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సోమవారమే సీబీఐకి లేఖరాశారు. అయితే ఆయన లేఖపై సీబీఐ నుంచి రెన్పాన్స్ రాలేదు. దీంతో ఆయన ఉదయం విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు..తదుపరి తీర్పు వెలువరించేవరకు…అరెస్ట్ సహా ఎలాంటి ఒత్తిళ్లకూ గురిచేయవద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే.