నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లో ఏవియేషన్ షో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా షోను ప్రారంభించారు. వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఇవాళ మొదలైన ప్రదర్శన నాలుగురోజులపాటు అంటే ఈనెల 27 వరకు కొనసాగనుంది. దేశవిదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్ ఫైటర్లు, హెలికాఫ్టర్లను ప్రదర్శనకు ఉంచారు. 2 వందలకుపైగా అంతర్జాతీయ సంస్థలు ఎగ్జిబిటర్లు ఈ ప్రదర్శనలో భాగస్వాములు హాజరవుతున్నారు. అయితే తొలి మూడురోజులు కేవలం వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి. చివరిరోజైన 27న సాధారణ ప్రజలను అనుమతిస్తారు. టికెట్ ధరను 500 రూపాయలుగా నిర్ణయించారు. ఆన్ లైన్లో వింగ్స్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ముందే రిజిస్టర్ చేసుకునే వీలుంది.