భారత మీడియాను రాబందులతో పోల్చుతూ.. ది ఆస్ట్రేలియన్ టుడే అనే ఆన్ లైన్ మీడియా ఒక ప్రత్యేక వ్యాసం రాసింది.
మనదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ మరణమృదంగాన్ని, తమ వికృత ప్రచారానికి ఇక్కడి మీడియా ఎలా వాడుకుంటోందో ఆధారాలతో చెబుతూ ఏకి పారేసింది. కరోనాను మించిన భయాన్ని, నిరాశను పెంచుతున్న రాబందు ల్లాంటి మీడియాతో కూడా భారత్ ప్రస్తుతం పోరాడాల్సి వస్తోంది. వైద్య సదుపాయాలు లేక ఏ ఒక్కరూ మరణించకూడదు.
భారత దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ ఎంతో వ్యయప్రయాసల కోర్చుకుని, సెకండ్ వేవ్ బారిన పడి ఉప్పనలా వచ్చి పడుతోన్న రోగుల్ని కాపాడుకునేందుకు డాక్టర్లు ఎంతో శ్రమపడుతున్నారు. ప్రతీ కోవిడ్ రోగి మరణం నిజంగా బాధాకరం, గుండెల్ని పిండేస్తోంది. ఈ జాతీయ విపత్తునే అదనుగా భావించి, కేంద్ర ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయాలనే తమ అజెండా లో భాగంగా, విషపూరితమైన కొంతమంది పాత్రికేయులు పుండు మీద కారం చల్లుతున్నారు. రాబందుల్లా పీక్కు తింటున్నారు !
ఆస్ట్రేలియా మీడియా కథనంలో ఏమున్నదంటే..
కొన్ని వాస్తవాలను వక్రీకరించి, తమ వాదనకు అనుకూలంగా,
ఒప్పించే విధంగా చెప్పడానికి వెనుకాడటం లేదు.మీడియాని ఎవరు నియంత్రిస్తారో, వారే ప్రజల మనోభావాలను నియంత్రించ గలరని అంటుంటారు. మొదటి వేవ్ కంటే ఘోరంగా తన మ్యూటెంట్ తో భారత్ లో వినాశనం సృష్టిస్తోన్న వైరస్ సెకండ్ వేవ్…., కమ్యునిస్ట్ రాబందు మీడియా పాత్రికేయులకు… అంతర్జాతీయ వేదికలపై భారత్ ను సిగ్గుతో తలదించుకునేట్లు అవమానకరమైన రీతిలో చిత్రీకరించే సువర్ణావకాశమైంది. మానవవిషాదాన్ని తమ దుష్ప్రచారానికి వాడుకుంటున్నారు.
మే 7 2020 నాడు విశాఖపట్నం లో జరిగిన LG పాలీమర్స్ గాస్ లీకేజి దుర్ఘటన వల్ల అపస్మారక స్థితిలో పడివున్న ఒక మహిళను కదిలిస్తున్న ఆమె కూతురు ఫొటోను.. ఈవిషాదానికి గుర్తుగా…..
భారతీయుల్ని కోవిడ్ నడిరోడ్డు మీదే మింగేస్తోంది అనే శీర్షిక తో ప్రచురించారు.
తన 26 ఏప్రిల్ 2021 నాటి తప్పుడు కథనానికి ఋజువుగా న్యూయార్క్ పోస్టు ఈ ఫొటోను వాడింది.
నెటిజన్ల నిరసనతో, ఆ ఫొటోను న్యూయార్క్ పోస్టు తొలగించి నప్పటికీ, ఆ వ్యాసం, దాని శీర్షిక ను అలానే ఉంచింది.
ఇటువంటి నకిలీ ఫొటోలుపయోగించి, భారత్ విషాదాన్ని అమ్ముకోవాలని న్యూయార్క్ పోస్టు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించింది ?
భారతదేశం బయటి పాఠకుల్లో సంచలనం కలిగించడానికి బ్రిటిష్ అమెరికన్ మీడియా కంపెనీ గెట్టీ ఇమేజెస్, హిందూ స్మశాన వాటికల్లోని దహన సంస్కార క్రియల ఫొటోలను అమ్ముకోవడం ద్వారా ఈ చితికి మంట పెట్టింది.
23 వేలకు ఎంత పెద్ద ఫొటోనైనా ఏ మీడియా గ్రూపైనా కొనుక్కోవచ్చు.
భారతీయ, భారతీయేతర ఫొటో జర్నలిస్టులు ఈ మహమ్మారి మరణాలను నిస్సిగ్గుగా సొమ్ము చేసుకుంటున్నారు.
ఇందుకోసం అనుమతులు లేకుండా డ్రోన్లతో తీసిన స్మశాన వాటికల ఏరియల్ ఫొటోలను వాడుకుంటున్నారు.
ది గార్డియన్ కూడా ఇదే ఏరియల్ ఫొటోను వాడటంతో అంతర్జాతీయ మీడియాలో సంచలనం రేగింది.
అంత్యక్రియల ఫొటోలు వ్యక్తిగతం కాబట్టి, ప్రసారానికి అనుమతులు లేవు కాబట్టి మేమా ఫొటోలను ఉపయోగించడం లేదందీ ఆ మీడియా. ఇక తండ్రిమరణాన్నీప్రచారానికివాడుకున్నబర్ఖాదత్ !మరి రాబందుల గుంపు ఉందంటే, వాటికి దగ్గర్లోనే శవాలున్నట్లు లెఖ్ఖ !
వైరాగ్యాన్ని కలిగించే భయానక, బీభత్స మరణాల వార్తల్ని అందించడానికి స్మశాన వాటికకు మించిన అనుకూల ప్రదేశం మరేదుంటుంది ? శ్మశాన వాటికల్లోని భయంకర దృశ్యాలను ప్రచారం చేయడంలో బర్ఖాదత్ ను మించిన వారెవరుంటారు ?
అప్పుడే, దురదృష్టవశాత్తూ, వృద్ధుడైన ఆమె తండ్రి అదే కోవిడ్ బారిన పడి చనిపోయారు.తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆమె, తండ్రి మరణాన్నీ తన ప్రచారానికి వాడుకుంది !నా తండ్రి చివరి మాటల్తో నేను షాక్ కి గురయ్యానని CNN విలేకరితో ఆమె అన్న మాటలు అందరం విన్నాం. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదని, శ్మశానంలో స్థలం లేదనీ చెప్పింది ఆమె !
ఇంతకీ బర్ఖాదత్ తన వీక్షకులకు, CNN రిపోర్టర్ కు చెప్పని నిజమేమిటంటే, ఆమె తండ్రిని ఖరీదైన మెడంటా హాస్పిటల్లో చేర్పించి అత్యుత్తమ డాక్టర్ల బృందం తో చికిత్స చేయించడం !అలాంటి అత్యుత్తమ డాక్టర్ల చికిత్స పొందాకా, ఆమె తండ్రి మాట్లాడిన చివరి మాటలు :
” ఉక్కిరిబిక్కిరౌతున్నాను. వైద్యం చేయండ “ని.
తన తండ్రి చివరి మాటలు వినడానికి ఆయన ఉన్న ICU లోకి ఎలా అనుమతి పొందిందో ఆమె మాత్రమే చెప్పగలదు.
తన తండ్రి మరణాన్నీ ప్రచారం కోసం వాడుకున్న బర్ఖాదత్, రాబందు మీడియా కు సరైన ఉదాహరణేగా మరి….
ప్రియమైన బర్ఖాదత్ ! అత్యుత్తమ మెడెంటా హాస్పిటల్లో.. అత్యుత్తమ వైద్యుల బృందంతో చికిత్స పొందిన
నీ తండ్రి చివరి మాటలు “ఉక్కిరిబిక్కిరౌతున్నాను.
వైద్యం చేయండ “ని. మరి
ఆయనకు వైద్యమందించిందెవరు ? అని ప్రశ్నించింది ఆ వ్యాసంలో.
కోవిడ్ 19 పాజిటివ్ కేసులు భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్నాయి.
కోవిడ్ బాధితులు, అనుమానితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. హాస్పిటల్లో చేరడమే ఒక యుద్ధమైంది రోగికి !
ఏదేమైనా, రోగుల ప్రాణాలు కాపాడటానికి భారత వైద్య వ్యవస్థ రేయింబవళ్ళు తమ శక్తి కొద్దీ శ్రమిస్తోంది.
నిర్మాణాత్మక విమర్శ చేయడమే మీడియా పని ! కానీ, కోవిడ్ తో బాధపడకపోయినా, భయోత్పాతాన్ని సృష్టిస్తోంది మీడియా !
మా ఈ వ్యాసం భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించేసరికి, మాది నకిలీ వెబ్సైట్ అని, రైట్ వింగ్ అనుకూలమని బర్ఖాదత్ ఆరోపించింది.మిగిలిన మీడియా తో కలిసి నీ రిపోర్ట్ లలో, ఎవర్ని సమర్థిస్తావో, వ్యతిరేకిస్తావో మేం లెఖ్ఝ చేయం.
మమ్మల్ని రైట్ వింగ్ అనుకూలమని అనడం మాత్రం మూర్ఖత్వమని మేమామెకు బదులిచ్చాం. విమర్శలను ఎదుర్కోవడం నీకు చేతకాదని తేల్చి చెప్పాం. మరిన్న వివరాలందితే వాటినీ ప్రచురిస్తాం.. ప్రచారం చేస్తాం అని ధీటుగానే బదులిచ్చింది ది ఆస్ట్రేలియన్ టుడే.