న్యూఢిల్లీలోని ఎర్రకోటలో గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పురబ్ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పాల్గొన్నారు. ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ గురు తేజ్ బహదూర్ అమర త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.
భారతదేశం ఏ దేశానికి, సమాజానికి ఎప్పుడూ ముప్పు కలిగించలేదు. ప్రస్తుత ప్రపంచ వివాదాల మధ్య నేటికీ మొత్తం ప్రపంచ సంక్షేమం కోసం ఆలోచిస్తుంది ఈ దేశం. భారత్ సిక్కు గురువుల ఆదర్శాలను అనుసరిస్తోందని నొక్కి చెప్పారు.
గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పురబ్ సందర్భాన్ని పురస్కరించుకుని స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు.
ఔరంగజేబు నిరంకుశ ఆలోచనలకు అడ్డుపడుతూ గురు తేజ్ బహదూర్ ‘హింద్ ది చాదర్’గా మారి శిలలా కఠినంగా నిలిచారు. ఔరంగజేబు ఎన్నో తలలు తెగనరికినా మన విశ్వాసాన్ని వమ్ము చేయలేకపోయాడనడానికి ఈ ఎర్రకోట సాక్షి అని అన్నారు.
గురు తేజ్ బహదూర్ త్యాగం భారతదేశంలోని అనేక తరాల వారికి, వారి సంస్కృతి గౌరవాన్ని కాపాడుకోవడానికి మరణించడానికైనా సిద్ధపడేలా ప్రేరేపించిందని గుర్తుచేశారు. ఈరోజు మన దేశం మన గురువుల ఆశయాలపై పూర్తి భక్తితో ముందుకు సాగుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ పుణ్య తిథి సందర్భంగా, నేను మొత్తం 10 మంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నాను అని మోదీ అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)