ఆదిలాబాద్ లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తమ లేఅవుట్ల కొరకు ఏకంగా దేవాలయాలను సైతం పక్కకు నెట్టే స్థాయి వరకు వెల్లరంటే భూమాఫియా దందా ఏ మేరకు రెచ్చిపోతుందో అర్థం అవుతోందని పలు హిందూ ధార్మిక సంఘాల నాయకులు అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా (టి) బైపాస్ దగ్గర ఉన్నటువంటి పురాతనమైన హనుమాన్ దేవాలయం ను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేఅవుట్ల కోసం ఏకంగా హనుమాన్ ఆలయాన్ని వేరే చోటకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపద్యంలో హిందూ వాహిని, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ళ నుండి ఎంతో చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయంను రియల్ వ్యాపారులు వేరే స్థలాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్ కు విన్నవించారు. ఆలయాన్ని వేరే చోటుకు మారిస్తే ఊరుకునేదే లేదని నాయకులు హెచ్చరించారు.