తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. 14 ఏళ్లుగా విధుల్లో ఉన్న తమను ప్రభుత్వం తిలగించటం అన్యాయమని వాపోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వ్యూహం పన్నారు.విధుల్లోంచి తొలగించడంతో రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారన్నారు. తక్షణమే అందరిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)