ఎర్రకోటపై దాడి చేసిన సూత్రదారి అరెస్ట్
గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై దాడిచేసిన సూత్రదారిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారకుడైన పంజాబీ నడుటు దీప్ సిద్దూను.. ఢిల్లీకి చెందిన స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోటోను కూడా మీడియాకు విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై జరిగిన దాడి ఘటనలో దీప్ సిద్ధూ ప్రధాన నిందితుడని.. రైతు ర్యాలీ హింసాత్మకంగా మారడానికి కూడా ఇతడే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. కాగా, ఎర్రకోట వైపు దూసుకువచ్చిన రైతులు అక్కడ జెండాలను పాతిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత.. దీప్ సిద్దూ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించారు.
ఇక దీప్ సిద్దూ కాలిఫోర్నియా నుంచి ఫేస్బుక్లో వీడియోలను అప్లోడ్ చేయించేవాడని పోలీసులు వెల్లడించారు. అందుకు దీప్ సిద్దూ తనకు పరిచయం ఉన్నకాలిఫోర్నియాలో ఉంటున్న ఓ గర్ల్ఫ్రెండ్తో టచ్లో ఉంటూ.. ఆమెకు అతను వీడియోలు పంపేవాడని పోలీసులు విచారణలో తేల్చారు. ఆ వీడియోలను అమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేదని గుర్తించారు.