‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ దేశభక్తి నినాదాలు చేసిన ముగ్గురు యువకులపై కొందరు దుండగులు కత్తితో దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ ఖుషినగర్లో జరిగింది. సచిన్, కృష్ణ, సాహుల్ అనే యువకులు కశ్మీర్ ఫైల్ సినిమా చివరిషో చూసి బయటకు వస్తూ నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న కొందరు వారితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దదై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడున్న వారు వెంటనే వారిని ఫాజిల్ నగర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ప్రథమచికిత్స అనంతరం సమీపంలోని వైద్యకళాశాలకు రెఫర్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)