నూపుర్ శర్మ వీడియోను చూసినందుకు 23 ఏళ్లవ్యక్తిపై దుండగులు దాడి చేసిన ఘటన బిహార్లో జరిగింది. సీతామర్హి జిల్లాకు చెందిన అంకిత్ కుమార్ ఝా అనే వ్యక్తి తన మొబైల్ లో నూపుర్ శర్మ ప్రసంగాల వీడియోలు చూస్తుండగా అక్కడే ఉన్న కొందరు ఇస్లామిస్టులు కత్తితో దాడి చేశారు. 6 కత్తిపోట్లకు గురైన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు హుటాహుటిన సమీపంలోని దర్భంగా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
కుమార్ ఝాపై కత్తిపోట్లకు దిగిన మహ్మద్ బిలాల్, మహ్మద్ నిహాల్, గులాబ్ రబన్ని,హిలాల్ అనే నలుగురిపై అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారు. పోలీసులు గాలిస్తున్నారు.
https://twitter.com/AshwiniSahaya/status/1549227197495316481?s=20&t=1HKTfTzZ84gJKQ5qy-FwZg
అయితే ఈ కేసులో మతపరమైన అంశాన్ని పోలీసులు తోసిపుచ్చారు. నూపుర్ వీడియోకు , ఈ దాడికి సంబంధం లేదనివారంటున్నారు. కారణాలు తెలియలేదని ….రోడ్డుపై వాళ్లు వాదనకు దిగారని…తరువాత దాడి జరిగిందని చెబుతున్నారు.
అయితే పాన్ షాపుకు వెళ్లిన సమయంలో నిందితులు తన ముఖంపై కావాలనే సిగరెట్ పొగను వదిలారని… నేను పట్టించుకోకుండా నూపుర్ శర్మ వీడియోలు చూస్తున్నానని..అప్పుడే నలుగురిలో ఒకడు వెనక నుంచి తనను పొడిచారని బాధితుడు తెలిపాడు. అయితే విచారణలో నిజాలు తేలుస్తామని…ఇరువర్గాల వాళ్లూ సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.