సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై రాకెట్తో నడిచే గ్రెనేడ్ (RPG) పేల్చడంతో పంజాబ్ హై అలర్ట్ లోకి వెళ్ళింది. మొహాలిలోని సెక్టార్ 77లో ఉన్న కార్యాలయంలో రాత్రి 7.45 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనంలోని ఒక అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.
ఆ ప్రాంతంలోని అధికారులు దానిపై రాసిన లాట్ నంబర్ ప్రకారం ఆ ఆయుధం ‘మేడ్ ఇన్ చైనా’ అని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని… మొహాలి ఎస్పీ (హెడ్క్వార్టర్స్) రవీందర్ పాల్ సింగ్ అన్నారు. పంజాబ్లో శాంతి వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించే వారెవరైనా విడిచిపెట్టబోమన్నారు సీఎం భగవంత్ మాన్.ఈ ఘటనపై చర్చించేందుకు కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు మాన్.