AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా దుండగులు ఆయన వాహనంపై కాల్పులు జరిపారు.
నిందితులను సచిన్, శుభంగా గుర్తించారు. ఒవైసీ ప్రసంగాలతో విసుగు చెందామని..అందుకే దాడి చేయాలనుకున్నట్టు పోలీసుల విచారణలో అంగీకరించారు. కొన్ని రోజులుగా ఒవైసీని వెంబడిస్తున్నారు. ఒవైసీ ప్రతి సభకూ హాజరయ్యారు.
గురువారం మీరట్లో ఒవైసీ పాల్గొన్న సభకు నిందితులు వెళ్లారు. సభ ముగిశాక ఆయన వాహనాన్ని వెంబడించారు. ఒవైసీ వాహనం టోల్ దగ్గర ఆగగానే అదను చూసుకొని వాహనంపై కాల్పులు జరిపారు.
ఒవైసీ సోదరులు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ తమ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారనే కోపంతోనే దాడియత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన సచిన్ కొద్ది రోజుల క్రితమే కంట్రీ మేడ్ పిస్టల్ను కొనుగోలు చేశాడు. అతనికి ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఒవైసీపై కాల్పులు జరిపిన తర్వాత నిందితులిద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడున్న గుంపు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. కానీ దొరికిపోయారు.
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022