గోరఖ్ పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో భాగంగా… ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నవీ ముంబైలో ముర్తజా అబ్బాసీ తన కుటుంబంతో ఉన్న ఇంటిని టీం సందర్శించింది.
ఏటీఎస్ బృందం సందర్శించింది. అయితే దాదాపు మూడేళ్లుగా ముర్తజా తనింటికి వెళ్లలేదని..కుటుంబ సభ్యులనూ కలవలేదని తెలిసింది. గోరఖ్ పూర్ ఆలయంలోకి వెళ్లబోతూ పోలీసులపైనా ఆయుధంతో దాడి చేసిన ముర్తజా అబ్బాసీ పోలీసు సిబ్బందిపై పదునైన ఆయుధంతో దాడి చేసిన అతను సడెన్ గా ఇంటి నుంచి వెళ్లలేదని తెలియడంతో మరి ఆ మధ్య కాలంలో ఎక్కడున్నాడనేది అందరి ప్రశ్న. ఈ కాలంలో నిందితుడు ఎక్కడున్నాడు, ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఏదన్నా ఉగ్రవాద సంస్థలో శిక్షణ తీసుకున్నాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన ముర్తజా నేపాల్ వెళ్లాడని చర్చ జరుగుతోంది. ఇక దాడి సందర్భంగా ఆలయం వెలుపల అతని సహచరుడు వదిలి వెళ్లిన బ్యాగ్ లో మతపరమైన సాహిత్యం కూడా ఉంది. ముస్లిం మతబోధకుడు జాకీర్ నాయక్ ప్రసంగాలు వినే ముర్తజా ఉగ్రవాదం వైపు ప్రేరేపితుడైనట్టు చెబుతున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)