కేరళలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కన్నూర్ జిల్లాలోని పనూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టకి చెందిన కార్యకర్తగా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి కొత్తుపరంబ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఏజెంట్గా ఉన్నాడని సమాచారం. అయితే స్థానికంగా జరిగిన ఎన్నికల్లో బోగస్ ఓట్లు వేయించాడంటూ మృతుడిపై సీపీఎం కార్యకర్తలు ఆరోపిస్తూ.. ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ దాడిలోనే మా కార్యకర్త చనిపోయాడంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆరోపిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
https://twitter.com/ANI/status/1379644134793732099