వెస్ట్ బెంగాల్లో టీఎంసీ శ్రేణులు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో అధికారం చేపట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీపై టీఎంసీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయి. తాజాగా బీజేపీ మైనార్టీ అగ్రనేత షాన్వాజ్ హుస్సేన్ ర్యాలీపై రాళ్ల దాడికి దిగారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
హౌరా జిల్లాలో మంగళవారం సాయంత్రం షాన్వాజ్ హుస్సేన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ర్యాలో ప్రసంగిస్తుండగా.. కొందరు దుండగులు రాళ్లతో దాడికి దిగారు. స్థానిక పోలీసులు కనీసం రక్షణ కల్పించలేదని.. తనకు ఉన్న వై ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించలేదని వాపోయారు. దీదీ రాక్షస పాలను ఇది నిదర్శనమని.. రాళ్ల దాడికి పాల్పడింది టీఎంసీ గుండాలనంటూ షాన్వాజ్ హుస్సేన్ ఆరోపించారు.
West Bengal: Stones were pelted at BJP leader Shahnawaz Hussain at a rally in Howrah, yesterday.
He said, "TMC goons didn't want me to hold a rally so they pelted stones. There was no Police protection, I have Y+ security but Police did nothing." pic.twitter.com/EJ8HDA9yc5— ANI (@ANI) April 7, 2021