వధువులిద్దరూ అక్కాచెల్లెల్లే. అసలైతే చెల్లెలితో అతనికి పెళ్లి నిశ్చయమైంది..కానీ అక్కనీ పెళ్లాడాల్సి వచ్చింది… ఒకే ముహూర్తంలో ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు.
మెదక్ జిల్లాలో జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లికి చెందిన గోల్పల వెంకటేశానికి ఇద్దరు కూతుళ్లు స్వాతి, శ్వేత. పెద్ద కూతురికి మతిస్థిమితం లేదు. చిన్నకూతురు శ్వేతకి శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన బాలరాజుతో వివాహం నిశ్చయించారు.అక్కకి పెళ్లి కాకుండా చెల్లెలికి ఎలా చేస్తారని బంధుమిత్రులనడంతో ఓ నిర్ణయానికి వచ్చేశారు…యువకుడిని, అతని బంధువుల్ని ఒప్పించి పెద్దకుమార్తె మెడలో కూడా తాళికట్టించారు..
ఇరువైపులా వాళ్లు …గ్రామస్తులూ ఒప్పుకోవడంతో
వధువులిద్దరిపేర్లూ శుభలేఖలో వేశారు. అనుకున్న ముహూర్తానికే అతిథుల సమక్షంలో వరుడు అక్కాచెల్లెళ్లిద్దరికీ మాంగళ్యధారణ చేశాడు.. అయితే శ్వేతని అప్పగింతలుచేసి వరుడితో అత్తారింటికి పంపి…మతిస్థిమితం లేని స్వాతిని ఇంట్లోనే పెట్టుకున్నారు..