హీరా గోల్డ్ స్కాంలో ప్రధాన నిందితురాలు సంస్థ ఎండీ షేక్ నౌషీరాకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వ్యక్తిగత, సంస్థకు చెందిన 24 ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. వాటి విలువ దాదాపు 33 కోట్లు.మనీలాండరింగ్ కేసులో షేక్ నౌషీరాను 2018 అక్టోబర్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో 367 కోట్ల విలువైన స్థిరచరాస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. హీరాగోల్డ్ కు చెందిన 5 వేల కోట్ల కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేసింది. సంస్థ నిర్వాకం వల్ల లక్షా 72వేల మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్టు గుర్తించారు.