పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన చేపట్టిన ఓ ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. దేశంలో ఉపఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వజీరాబాద్ ర్యాలీలో మాట్లాడేందుకు ఆయన కంటైనర్ పైకి ఎక్కగానే ఓ దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇమ్రాన్ కాలికి గాయాలయ్యాయి. అక్కడున్న మరికొందరూ గాయపడ్డారు. హుటాహుటిన ఇమ్రాన్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వంపై మండిపడింది పీటీఐ. షెహబాజ్ షరీఫ్ ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని మండిపడుతున్నారు ఇమ్రాన్ అనుచరులు.
https://twitter.com/ANI/status/1588145887943200768?s=20&t=qy8BDIXTtNBd6J8TPbKqCA