అసెంబ్లీ ఎన్నికల ముంగిట యూపీ బీజేపీ నాయకుడు అజయ్ శర్మ పై కాల్పులు జరిగాయి. ప్రయాగరాజ్ లో అర్థరాత్రి ఆయన ఇంటిసమీపంలో దుండగులు కాల్చారు. అజయ్ శర్మ భుజం, కడుపులోకి దగ్గరినుంచి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అజయ్ శర్మ కిసాన్ మోర్చా అధ్యక్షుడు.
అజయ్ తన కుటుంబంతో ఫఫమౌ సమీపంలోని లేహ్రా అనే గ్రామంలో నివసిస్తున్నారు. వ్యక్తిగత పనులపై ఆయన బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాదాపు ఐదురౌండ్ల కాల్పులు జరిగినట్టు చెబుతున్నారు. కాల్పుల్లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కార్, బైక్ మీద దుండగులు వచ్చారని కాల్పుల శబ్దం విని తామంతా బయటకి రావడంతో వారు పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. ముసుగుతో వచ్చిన నలుగురు ఈ ఘాతుకానికి పాల్పడ్టట్టు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రయాగరాజ్ లో బీజేపీ నాయకులపై కాల్పులు జరగడం ఇదేం మొదటిసారి కాదు. అక్టోబరు 25న జిల్లాలోని గంగా ఝూన్సీ పోలీస్ స్టేషన్ సమీపంలో బీజేపీ మండలాధ్యక్షుడు అవధేష్ మౌర్యపై కాల్పులు జరిగాయి.