తెలంగాణ సీఎం కేసీఆర్ పై అసోంలో కేసునమోదు చేసే యోచనలో ఆ రాష్ట్ర పోలీసులున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించి ఆధారాలు కావాలంటూ కేసీఆర్ భారత సైన్యాన్ని ప్రశ్నించినందుకు బీజేపీ సపోర్టర్లు ఆయనపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. భారతదేశ సమగ్రతను దెబ్బతీసేలా, ఆర్మీ త్యాగాలను అవమానించేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. దీంతో ఆయనపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయంటున్నారు.
ఇటీవల అసోం సీఎం హిమంత శర్మ రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్ కు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ అడగడంలో తప్పులేదని…తానూ అదే అడుగుతున్నాననీ అన్నారు.
అటు హిమంతపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)