శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం అసోంలో క్యాంపేసింది. ఒక విలాసవంతమైన హోటల్లోవాళ్లు బస చేస్తున్నారు.అయితే మహా రాజకీయం అసోం చేరుకోవడంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. . విధ్వంసకర వరదల నుంచి బయటపడటానికి రాష్ట్రానికి ఆదాయం అవసరం కాబట్టి అసోం సందర్శించడానికి తాను అందరినీ స్వాగతిస్తున్నానని అన్నారు. అసోం ‘అంతర్జాతీయ రాజకీయ కేంద్రం’గా మారితే తాను సంతోషిస్తా.. గువాహతిలో చాలా లగ్జరీ హోటళ్లు ఉన్నాయి, వాటిల్లో గదులు నిండుగా ఉంటే జీఎస్టీ ద్వారా మాకు ఆదాయం వస్తుంది.. రాష్ట్రంలో వరదల కారణంగా ఈ కష్ట సమయాల్లో మాకు ఇది అవసరం.. మేం అందుకు సంతోషిస్తాం” అని అన్నారు.
ఈశాన్య రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 55 లక్షల మంది ప్రజలు ఇప్పుడు వరదల బారిన పడ్డారు. విపత్తు కారణంగా 89 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్ర ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం సూరత్ నుంచి చార్టర్ ఫ్లైట్ లో అసోంకు చేరుకున్నారు. గట్టి భద్రత మధ్య గువాహతి శివార్లలోని విలాసవంతమైన హోటల్కు చేరుకున్నారు.