అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ మదర్సాను కూల్చివేసింది అసోం ప్రభుత్వం. బార్ పేట జిల్లాలోని ధకలియాపరాలో ఓ మదర్సాకు ఉగ్రవాదసంస్థతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు బుల్డోజర్ తో దాన్ని కూల్చేశారు. దేశవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయి. జిహాదీసంస్థలతో అక్కడివాళ్లకు సంబంధాలున్నాయని స్థానికులు పలుమార్లు ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. అంతేకాక ఆ మదర్సా ప్రభుత్వ భూమిలో ఉన్నందున కూల్చివేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇక బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అక్బర్ అలీ, అబుల్ కలాం ఆజాద్ అనే ఇద్దరు అన్నదమ్ములను అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Assam | Arrested accused linked with the AQIS/ABT in Barpeta district have been identified as Akbar Ali and Abul Kalam Azad by the police pic.twitter.com/RoZ1hmRait
— ANI (@ANI) August 29, 2022