అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అప్రమత్తమై వందలాది మంది ప్రాణాలను కాపాడింది. సకాలంలో సహాయకచర్యలకు దిగడంతో ప్రాణనష్టం తప్పినా… భారీ ఆస్తినష్టం జరిగింది. అయితే అసోంలో తాజా విపత్తు సహజవిపత్తు కాదని మీకు తెలుసా.అవును . ఆలస్యంగా బయటపడిన వాస్తవం ఇది. దుండగులు కావాలని చేసిన దుశ్చర్యకు వందలమంది బలైతే..లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.
అసోం సిల్చార్లోని భయంకరమైన వినాశక వరదకు కారణం…బరాక్ నది కట్ట కూలడమని మొదట భావించారు. కానీ ఆ నది కట్ట గాలికో, భారీవర్షానికో కూలింది కాదు..కాచర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు కావాలని కట్టను కూల్చేశారు. నిందితులను
మిథు హుస్సేన్ లస్కర్, కాబుల్ ఖాన్గా గుర్తించారు ఇప్పటికే పోలీసులు.
శుక్రవారం రాత్రి ఖాన్ను అదుపులోకి తీసుకోగా, శనివారం లస్కర్ పట్టుబడ్డాడు. వీరి అరెస్టును కాచర్ పోలీస్ సూపరింటెండెంట్ రమణదీప్ కౌర్ ధృవీకరించారు. మే 24న గుర్తుతెలియని దుండగులు, పట్టణ కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెతుకండి వద్ద కట్టను బద్దలు కొట్టినట్టు తమకు సమాచారం ఉందని…జలవనరుల శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అది మనుషులు కావాలని చేసిన ధ్వంసమని, ఇంతటి విపత్తుకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అసోం సీఎం హిమంత గతంలోనే ప్రకటించారు. మొత్తంగా సిల్చార్లో ఘోరమైన వరదకు దారితీసిన ఆనకట్ట కూల్చివేతలో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితులను గుర్తించారు. అయితే అక్కడ అంత ఘోరం జరిగిందే ఏ జాతీయ మీడియా దీన్ని పట్టించుకోలేదు.
కాచర్ జిల్లాను సీఎం సందర్శించినప్పుడు కాబూల్ ఖాన్ పగుళ్లను కొందరు గ్రామస్తులు చూపించారు. బేతుకండి ఘటన మాకు గుణపాఠం వంటిందని…ఇకముందు కరకట్ట సమీపాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిల్చార్ వరద కేసును గౌహతిలో దాఖలు చేస్తారని…అనుమానితులనువిచారిస్తామని హిమంత అన్నారు.
అస్సాం వరద విపత్తులో మరణించిన వారి సంఖ్య దాదాపు 200కి చేరింది. 30 జిల్లాల్లో 29.70 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
మరియు మరో 14 మంది మరణించారు. కాచర్ జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న సిల్చార్ పట్టణంలో చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇటీవలి పర్యటనలో సిల్చార్ దుర్ఘటనలో చనిపోయిన పది మంది కుటుంబాలకు 4 లక్షల చొప్పున సాయం అందజేశారు సీఎం.