అసోం సీఎం హిమంతశర్వ జగ్గీవాసుదేవ్ తో కలిసి రాత్రిపూట కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించడం వివాదాస్పదం అవుతోంది. సాక్షాత్తూ సీఎం చట్టాన్ని అతిక్రమించారంటూ ఆయనపై ఫిర్యాదులు సైతం అందాయి.
అసలైతే సీఎం హిమంత, మంత్రి జయంత మల్లా బారువా శనివారం పార్క్ ను సందర్శించాల్సి ఉంది. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కాస్త ఆలస్యంగా వారు పార్క్ నకు వెళ్లారు. ఆసమయంలో పార్క్ సందర్శనం అంటే.. మూగజీవాలకు ఇబ్బందికలిగించడమేనని…చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఉద్యమకారుడు సోనేశ్వర్ నరా ఆరోపించారు. సీఎంను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు నరా. అయితే ఆరోపణలను ఖండించారు సీఎం. తాను నిబంధనలు ఉల్లంఘించలేదని…చట్టప్రకారమే రక్షిత ప్రాంతాల్లో పర్యటించేందుకు పార్క్ అధికారులు అనుమతించారని వివరణ ఇచ్చారు. అటు అటవీ అధికారులు సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. వాళ్లు రాత్రిపూటంతా సఫారీకి వెళ్లారన్న ప్రచారం అవాస్తవం అని…వారి అధికార పర్యటన కాస్త ఆలస్యమైందని వెల్లడించారు. అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున పర్యటనను రద్దు చేయలేదని…అందుకే కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.