తెలంగాణ సీఎం కేసీఆర్ బిహార్ పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్తో కలిసి ఆయన పాట్నాలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా… బీజేపీయేతర పక్షాల ప్రధాని అభ్యర్ధిగా నితీశ్ను ప్రతిపాదిస్తారా అని విలేకరి కేసీఆర్ను ప్రశ్నించారు. ఆయనను ప్రతిపాదించడానికి తానెవర్ని అని కేసీఆర్ తిరిగి ప్రశ్నించారు. అప్పుడు నితీశ్ తాను కూర్చున్న కుర్చీలోనుంచి లేచారు. ఆ వెంటే తేజస్వీ యాదవ్ కూడా నిల్చున్నారు. అయినా విలేకరులు ప్రశ్నలు అడుగుతునే ఉన్నారు. ఆ సమయంలో కేసీఆర్ విలేకరుల ప్రశ్నలకు జవాబు చెబుతూనే కూర్చోమని నితీశ్ను బతిమాలారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 15 సార్లు బతిమాలారు. అయినా నితీశ్ కూర్చోలేదు. చివరకు 16వ సారి మళ్లీ రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ నితీశ్ గారు కూర్చొండి. విలేకరుల సమావేశం ఐదు నిమిషాల్లో ముగించేస్తానని చెప్పారు. అప్పుడు నితీశ్ కూర్చోవాల్సి వచ్చింది.