ఒక ప్రక్క చైనా ఆధిపత్య ధోరణులు, మరోపక్క ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాజ్యం, ఇంకొక ప్రక్క పాకిస్తాన్ ఎగదోస్తూన్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కలగలిసి మధ్య ఆసియా దేశాలను సందిగ్ధంలో పడేసాయి . ఆ దేశాలతో సంబంధం కోసం భారత్ ముందుకొస్తోంది. ఆ దిశలో సాగుతున్న ప్రయత్నాలలో 5 దేశాల అధ్యక్షులు మొన్న భారత్ 73వ గణతంత్ర దినోత్సవంకు ముఖ్య అతిథులుగా రావలసివుండే , కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా రాలేకపోయారు, దాంతో జనవరి 27వ తేదీన ఐదు దేశాల అధ్యక్షులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అన్ని దేశాల వాళ్లు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల కారణంగా కలవరపాటుకు గురి అవుతున్నట్లుగా వ్యక్తం చేశారు. అట్లాగే ఆఫ్గనిస్తాన్ లో శాంతియుతంగా సురక్షితంగా ఉండేందుకు పూర్తి మద్దతు అందించాలని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ” మధ్యఆసియా దేశాలతో అన్ని రకాల సంబంధాలకు భారత్ కట్టుబడి ఉన్నదని ఆ నేపథ్యంలో మూడు విషయాలు ప్రస్తావించారు
1) భారత్ మధ్య ఆసియా దేశాల తో సంబంధాలు ప్రాంతీయ సురక్ష, అభివృద్ధికి దోహదపరిచే విధంగా ఉంటుందని
2) ఈ పని పటిష్ట పరచడానికి ఒక పక్కా ప్రణాళిక తయారు చేయడం, దాని ద్వారా వివిధ స్థాయిలలో పరస్పర ఆలోచన లా వినిమయం అనుసంధానం పటిష్ట పరచుకోవడం
3) రాబోవు 30 సంవత్సరాలకు ప్రాంతీయ అనుసంధానం సహకారం కోసం ఒక సమగ్ర ప్రణాళిక ఒక రోడ్ మ్యాప్ తయారు కావాలి”అని చెప్పారు.
ఔషధం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్, విద్య, సమాచార సాంకేతికత, వ్యాపార ప్రక్రియ ఔట్సోర్సింగ్ (BPO), మౌలిక సదుపాయాలు, వ్యవసాయం మరియు వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధనం, అంతరిక్ష పరిశ్రమ, వస్త్రాలు, తోలు వంటి రంగాలలో వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందించడానికి గట్టి ప్రయత్నాలు చేయాలని వారు ఉద్ఘాటించారు. మరియు పాదరక్షల పరిశ్రమ, రత్నాలు & ఆభరణాలు మొదలైనవి. ”2020లో స్థాపించబడిన ఇండియా–సెంట్రల్ ఆసియా బిజినెస్ కౌన్సిల్ (ICABC)ని వారు ప్రోత్సహించారు. ఒకరికొకరు దేశాల్లో పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడానికి ICABC కింద ఇండియా–సెంట్రల్ ఆసియా ఇన్వెస్ట్మెంట్ క్లబ్ను సృష్టించే ప్రతిపాదనను వారు గుర్తించారు. కనెక్టివిటీ మరియు ఇంధన సహకారంపై రౌండ్ టేబుల్ నిర్వహించాలని మరియు భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాల వాణిజ్య మరియు పరిశ్రమల మధ్య పరస్పర చర్చ కోసం ప్రత్యేక ఫోరమ్ను నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ మధ్య ఆసియా నేతలు స్వాగతించారు భారత్ మధ్య ఆసియా దేశాలలో వాణిజ్యం పెట్టుబడులు అభివృద్ధి పరస్పర సహకారం భద్రత రక్షణ సంస్కృతి ప్రజల మధ్య సంబంధాలు మెరుగు పరచడం నిర్ణయించబడింది ఆ యోజన సమీక్ష కోసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కలవాలని కూడా నిర్ణయం జరిగింది తదుపరి సమావేశం 2024 లో ఉంటాయి. అట్లాగే ఆసియా దేశాలలో ప్రజలకు బౌద్ధమత సంబంధాలున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రదర్శనలు ఏర్పాటు కు ఏకాభిప్రాయం నిర్ణయం జరిగింది, అధ్యయనం కోసం ఎంపిక చేసిన 100 మంది యువకులను మధ్య ఆసియా దేశాల నుండి ప్రతి సంవత్సరం భారత్ కు రావాలని సూత్రప్రాయంగా అంగీకరించారు.
ఆ సమావేశాలలో వ్యక్తమైన అభిప్రాయాలు
ఇరాన్ లోని చాబహార్ ఓడరేవు తమ దేశాల ఎగుమతులకు ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని భావిస్తున్నారు, మధ్య ఆసియా లోని ఐదు దేశాలు ఇస్లాం దేశాలు కానీ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సమర్థించడం లేదు ఆఫ్ఘనిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థల కారణంగా తమ దేశాలకు ముప్పు ఉండదని కూడా భావిస్తున్నారు, దానితో ఆందోళనగా ఉన్నారు. పాకిస్థాన్ లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో తాలిబాన్ లకు సంభందాలు ఉన్నాయి, దాని కారణంగా భారత్ కూడా ఆ సంస్థలతో సమస్యలు ఉన్నాయి. తజికిస్తాన్ తుర్కమేనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో 2,387 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్నాయి అందుకే ఆదేశాలు ఆందోళనతో ఉన్నాయి . ఉజ్బెకిస్తాన్ లో నడుస్తున్నా ఇస్లామిక్ ఉద్యమం, ఇస్లామిక్ జిహాద్ యూనియన్ జమాత్ కు చెందిన వాళ్ళు ఆల్ ఖైదా , ISKP , లష్కరే తోయిబా జైష్ మొహమ్మద్ సంస్థలతో కూడా సంబంధాలున్నాయి, సరిహద్దులలో సుమారు పదివేల మంది మిలిటెంట్లు కాచుకు కూర్చున్నారు ఇది అందరికీ ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ మధ్య జరిగిన ఒక సమావేశంలో తజకిస్తాన్ అధ్యక్షుడు ఏమో మ లి రెహమాన్ మాట్లాడుతూ” తమ దేశం యొక్క దక్షిణ సరిహద్దు దగ్గరఆరు వేల మంది ఉగ్రవాదులు ఉనికి గురించి” చెప్పారు. ఈ గ్రూపు లన్నీ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపైనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఐరోపా సరిహద్దు వరకు కాలిఫేట్ ఆలోచన లను పునరుద్ధరించటానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాలిఫేట్ ఏమిటి ? ఎందుకు ?
”ఫాసిస్ట్ పెట్టుబడిదారులచే ఎక్కువగా హైజాక్ చేయబడిన అస్తవ్యస్తమైన ప్రపంచంలో శాశ్వత శాంతికి మధ్యవర్తిత్వం వహించే ఏకైక ఆలోచన. ముస్లిం ఉమ్మా; పునరుజ్జీవింపబడిన ఒట్టోమన్ కాలిఫేట్, ఇది చాలామందికి కలగా కనబడవచ్చు ఇస్లాం వ్యవహారాలను జాగ్రత్తగా పరిశీలించిన వాళ్లకు అర్ధమౌతుంది. టర్కీలు తాము కోల్పోయిన ఇస్లామిక్ వైభవాన్ని పునరుద్ధరిస్తున్నప్పుడు దృఢమైన టర్కీ వైపు ముస్లిం దేశాలు ఆకర్షించబడతాయి.” ఈ విషయాన్ని ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్కాలర్, కువైట్ ఆధారిత జియోపాలిటికల్ అనలిస్ట్ & రచయిత డాక్టర్ అర్షద్ మొహ్సిన్ ఇచ్చిన ఒక సందేశము.అట్లాగే దశాబ్దాలుగా భారత ఉపఖండంలోని ముస్లింలకు అకడమిక్ & జర్నలిస్టిక్ సేవలకు ప్రసిద్ధి చేందిన .ఇస్లామిక్ డైజెస్ట్ “హుడా” పత్రిక ఈ దిశలో ఆలోచనలను పంచుకోవటానికి ఇస్లామిక్ ప్రపంచంలో గొప్ప విజయాన్ని కాంక్షిస్తూ “కాలిఫేట్ 2023″ సంచికను కూడా విడుదల చేయబోతున్నది .ఆ కాలిఫేట్ ఆలోచనలను తాలిబాన్లు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది, దానితో అక్కడ పనిచేసే ఉగ్రవాద సంస్థల కారణంగా ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. ఒకప్రక్క ఈ విషయాలు చర్చిస్తూఉంటే ఇదే సమయంలో మరో హడావిడి సమావేశం కూడా జరిగింది. మొన్న జనవరి 24వ తేదీ నాడు హడావిడిగా చైనా మధ్య ఆసియా దేశాలతో ఒక అత్యవసర సమావేశం నిర్వహించింది, అంటే భారత్ కు పోటీగా ఆ దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి చైనా గూడా ప్రయత్నిస్తోంది , చైనా అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని చూపించేందుకు భారత్ ను వెనక్కి నెట్టాలి. భారత్ మధ్య ఆసియా దేశాల సంబంధాలు ఎక్కువగా ఉండకూడదు, ఇదే చైనా బలహీనమైన ఆలోచన ఎందుకంటే చైనా దేశంతో సంబంధాలు పెట్టుకోని అప్పులు తీసుకున్న దేశాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో అన్ని దేశాలకు తెలుసు, చైనాతో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా తెలుసు, అదే చైనా యొక్క బలహీనత, తనతో సంబంధం ఉన్న దేశాలకు ఒత్తిడితో పెట్టుబడులు పెట్టి ఆదేశాలు పై ఆధిపత్యం కోసం సమస్యలు సృష్టించడం, ఆదేశాలు బలహీనంగా ఉంటుంది, అదే దాని ఆధిపత్యము అనుకుంటున్నది. నిజంగా అదే చైనా యొక్క బలహీనత ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత్ శక్తివంతంగా కావాలని ఆసియా ఖండంలోని దేశాలు కోరుకుంటున్నాయి. ఆ దిశలో భారత్ ప్రయాణం సాగించవలసిన అవసరం ఉన్నదని అర్థమవుతుంది .
Courtesy :- NewsBharatiyam