బాలీవుడ్ నడి ఆశాఫరేఖ్ ను చలనచిత్రరంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే వరించింది.
సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవకుగానూ కేంద్రప్రభుత్వం ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది.ఉదిత్ నారాయణ్, హేమా మాలిని, ఆశా భోంస్లే, పూనమ్ ధిల్లాన్, టీఎస్ నాగభరణతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఆశా పరేఖ్ పేరుకి ఎంపిక చేసింది. బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె…1950-60 మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ గా ఎదిగారు. తీస్రీ మంజిల్, కటి పతంగ్, ప్యార్ కా మౌసమ్, దో బదన్, చిరాగ్ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు పొందారు. దాదాపు వంద సినిమాల్లో నటించిన ఆశా ఫరేఖ్… దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, రాజేష్ ఖన్నా వంటి అగ్రహీరోల సరసన నటించారు. బాలీవుడ్ చిత్రాలతోపాటు… మాతృభాష అయిన గుజరాతీ, పంజాబీ, కన్నడ తదితర భారతీయ భాషాచిత్రాల్లో నటించారు ఆశా. 1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ ఇచ్చింది. 1998-2001 మధ్య సీబీఎఫ్సీ ఛైర్పర్సన్గా ఆమె పనిచేశారు.