మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల అరబ్ కంట్రీస్ లో భారత్ పరువుపోయిందని అన్నారు..
గల్ఫ్ దేశాల్లోని భారతీయులపై దాడులు జరిగితే విదేశాంగ శాఖ ఏం చేస్తుందని అసద్ నిలదీశారు. ఆమెను సస్పెండ్ చేసి వదిలిపెట్టవద్దని శిక్షించాలనీ అన్నారు. నూపుర్ వంటి వాళ్లను పార్టీ ఎంచుకుని కావాలనే డిబేట్లకు పంపి రెచ్చిగొట్టే ప్రసంగాలు చేయిస్తుందని ఆరోపించారు.
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల ఫలితంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి గౌరవార్థం ఖతర్లో ఇవ్వాల్సిన విందు రద్దు అయిందని, రెండు గల్ఫ్ దేశాలు భారత రాయబారులకు సమన్లు ఇచ్చాయని గుర్తుచేసిన అసద్… ఆమెను తక్షణం అరెస్ట్ చేయాలన్నారు..