బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ లక్ష్యంగా మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు దేశద్రోహం కేసులో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద జ్ఞానవాపి మసీదు, అక్కడి శృంగర్ గౌరీ ఆలయ కాంప్లెక్స్ దగ్గర సర్వే చేసి వీడియో తీయాలని వారణాసి కోర్టు ఆదేశించడాన్ని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఈ సర్వే చట్టాన్ని ఉల్లంఘిస్తోందని.. ప్రాంగణంలో సర్వే, వీడియోగ్రఫీని అనుమతించడం ద్వారా ముస్లిం వ్యతిరేక హింసకు కోర్టు మార్గం సుగమం చేస్తోందని ఒవైసీ అన్న విషయం తెలిసిందే. ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒవైసీ ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలని ఆయన చూస్తున్నారు. జిన్నా కావాలని కలలుకంటున్నట్టున్నారు.. అసలు ఈ వ్యాఖ్యలు చేసిన ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని హరనాథ్ అన్నారు.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సర్వే విషయానికొస్తే, ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉంది. స్థానిక కోర్టు నిర్ణయాన్ని ముస్లిం పక్షం ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసినప్పుడు, కోర్టు తిరస్కరించింది. కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలనే ఇంగితం అసద్ కు లేదా అనీ వ్యాఖ్యానించారు. స్థానిక కోర్టు జ్ఞాన్వాపి మసీదును సర్వే చేయాలని ఆదేశించింది, దానిని ముస్లిం పక్షం వారు అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. జ్ఞాన్వాపి మసీదు సర్వే చేస్తే భయమెందుకు …ఎందుకు నిజం బయటపడకూదనుకుంటున్నారు అని నిలదీశారు.
రామజన్మభూమి తీర్పుపై ముస్లిం సోదరులు దేశంలో మత సామరస్యాన్ని సృష్టించిన విధానం తెలిసిందే, తుదితీర్పును ఎలాగైతే ఆమోదించారో అదే విధంగా స్థానిక కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి సర్వేను అనుమతించాలి అనిఅన్నారు.
“కాశీలోని జ్ఞాన్వాపి మసీదును సర్వే చేయాలనే ఈ ఉత్తర్వు 1991 ప్లేసెస్ అఫ్ వర్షిప్ యాక్ట్ ను బహిరంగంగా ఉల్లంఘించింది, ఈ చట్టం మత స్థలాల మార్పిడిని నిషేధిస్తుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను ఈ చట్టం పరిరక్షిస్తుందని అయోధ్య తీర్పులో సుప్రీమ్ కోర్ట్ పేర్కొంది” అని ఒవైసి ట్వీట్ చేశారు. కోర్టు, సుప్రీమ్ కోర్టుని నిర్మొహమాటంగా ధిక్కరించడం దురదృష్టకరం. ఈ ఉత్తర్వు ద్వారా రక్తపాతానికి, 1980-90ల నాటి ముస్లిం వ్యతిరేక హింసకు కోర్టు మార్గం తెరుస్తోంది” అని మరో ట్వీట్ చేశారు.
వారణాసి సివిల్ జడ్జి ఆదేశం మేరకు కోర్టు కమిషనర్ 2022 మే 6వ తేదీన శృంగర్ గౌరీ దేవాలయం విగ్రహం తోపాటు వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదు వివాదాస్పద కట్టడంలోని ప్రాంగణాన్ని సర్వే చేసి, వీడియోగ్రఫీ చేసిన ఒక రోజు తర్వాత అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రకటన చేశారు.