కార్డెలియా డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) క్లీన్ చిట్ ఇచ్చింది. వారిపై ఉన్న అభియోగాలను రుజువు చేయడానికి తగిన సాక్ష్యాదారాలు లేవని పేర్కొంది. అయితే NDPS చట్ట నిబంధనల ప్రకారం ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 14 మందిపై ఫిర్యాదు నమోదు చేస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. గత ఏడాది ముంబై తీరంలో లగ్జరీ క్రూయిజ్ లైనర్లో డ్రగ్స్ దొరికిన తర్వాత 14 మంది నిందితుల పేర్లతో.. 6,000 పేజీల ఛార్జ్ షీట్ను యాంటీ డ్రగ్ ఏజెన్సీ దాఖలు చేసింది. దాడుల అనంతరం అరెస్టయిన ఆర్యన్ ఖాన్ను నిందితుడిగా పేర్కొనలేదు.
అక్టోబరు 2021 ప్రారంభంలో కార్డెలియా క్రూయిసెస్ ఎంప్రెస్ షిప్లో హై-ప్రొఫైల్ పార్టీ జరిగింది. సమాచారం ఆధారంగా, NCB అధికారులు ప్రయాణీకుల వేషం వేసుకుని క్రూయిజ్ షిప్లోకి ఎక్కారు. ఓడ ముంబై తీరంలో ప్రయాణించిన తర్వాత, రేవ్ పార్టీ ప్రారంభమైంది. చాలా మంది ప్రయాణికులు నిషేధిత డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించారు. ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగి డ్రగ్స్ తీసుకుంటున్న 7-8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
2021 అక్టోబర్ 3న రేవ్ పార్టీ జరుగుతున్న ఒక లగ్జరీ క్రూయిజ్ లైనర్ నుంచి ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ సహా ఇతర 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. నివేదికల ప్రకారం, ఖాన్ సహా అతనితో ఉన్న ఇతరులపై కొకైన్, ఎక్స్టసీ మాత్రలు కనుగొన్నారు.
అక్టోబర్ 28న బాంబే హైకోర్టు ఈ కేసులో ఖాన్ తోపాటు మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.