డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణను సెషన్స్ కోర్టు వాయిదా వేసింది. మరో రెండులు ఆర్యన్ ఆర్ధర్ రోడ్డు జైల్లోనే ఉండాలి. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు వారం రోజుల సమయాన్నిఏసీబీ కోరడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసింది కోర్టు. అయితే ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ను ఎన్సీబీ గుర్తించలేదని అలాంటప్పుడు ఇంకా కస్టడీకి సమయం అడగడం ఎందుకని ఆర్యన్ తరఫున సతీష్ మనేషిండే, అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఎన్సీబీ మరింత గడువు కోరడం సరికాదని అన్నారు. అయితే వివరాలు రాబట్టేందుకు ఎన్సీబీకి వారం రోజులు కావాలని….కనీసం రెండు, మూడు రోజులైనా సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏఎం ఛిమాల్కర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
క్రూయిజ్ షిప్పై దాడిలో ఆర్యన్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టేన్సెస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు నమోదు చేసింది. దీంతో అక్టోబర్ 4 వరకూ ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్ను రిమాండ్ చేశారు. ఆ తర్వాత కస్టడీకి 7వ తేదీ వరకూ పొడిగించారు. అక్టోబర్ 8న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు ఇచ్చారు.