రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా చాలామంది అనుకుంటారు. కానీ ఇది అవగాహన లోపం మాత్రమే. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సంఘ్ వ్యవస్థ లో,, కులం, వర్గం, వర్ణం అనే భేదాలు ఉండవు. రాజకీయ పార్టీల భావనలు అంతకన్నా ఉండవు. అందుచేతనే ఈ ఏడాది వికాస వర్గ ముగింపు ఉత్సవానికి మాజీ కాంగ్రెస్ నాయకులు అరవింద్ నేతమ్ ను ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంలో పనిచేసే స్వయం సేవకులకు ప్రతి ఏడాది శిక్షణ నిర్వహిస్తారు. ఐదు దశల్లో జరిగే ఈ శిక్షణలో కార్యకర్త వికాస వర్గ టూ అనేది అత్యున్నతమైనది. గతంలో దీనిని తృతీయవర్షగా పిలిచేవారు. నాగపూర్ లో రెసిడెన్షియల్ పద్ధతిలో జరిగే ఈ శిక్షణ చాలా అద్భుతంగా ఉంటుంది.
దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి ఈ వికాస వర్గకు స్వయం సేవకులు హాజరవుతారు. ఈ ఏడాది నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్ కార్యకర్త వికాస వర్గ-2 నిర్వహించారు. ఈ నెల 5 న అంటే గురువారం నాడు ఈ శిక్షా వర్గ ముగుస్తున్నది. ఈ సమారోప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మాజీ నేత అరవింద్ నేతమ్ ను ముఖ్య అతిథిగా సంఘ్ ఆహ్వానించింది.సంఘ్ ఆహ్వానించడంతో ఆయన ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో కలిసి కాంగ్రెస్ మాజీ మంత్రి అరవింద్ నేతమ్ వేదికను పంచుకోనున్నారు.
ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అరవింద్ నేతమ్ ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతానికి చెందిన వనవాసీ నాయకుడు. కాంగ్రెస్ లో సీనియర్ నేత కూడా.
దేశంలో అత్యంత వివాదాస్పదమైన ఎమర్జెన్సీ సమయంలో అరవింద్ నేతమ్ 1973 నుంచి 77 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగారు.
కానీ కాంగ్రెస్ పార్టీ బూటకపు విధానాలతో అరవింద నేతమ్ విసిగిపోయారు. లౌకికవాదం ముసకులు చత్తీస్గడ్ జార్ఖండ్ వంటి అటవీ ప్రాంతాల్లో మిషనరీలను కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసేందుకు ఈ ప్రాంతాలలో మిషనరీలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. వీటికి అండగా నిలవడం అంటే మన గిరిజనులను మనమే మోసం చేయడం అని అరవింద్ నేతమ్ అర్థం చేసుకున్నారు.
కొంతకాలం క్రితమే కాంగ్రెస్ పార్టీలోని సైద్ధాంతిక భావనలు, నాయకత్వ విషయాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ పార్టీ కి దూరమయ్యారు. ఆ తర్వాత వనవాసి సమూహాల కూటమి అయిన సర్వ ఆదివాసీ సమాజ్ కి రాజకీయ విభాగంగా ‘‘హమర్ రాజ్ పార్టీ’’ ని స్థాపించారు. ఆయన పార్టీ 2023 ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బలమైన ప్రభావం చూపించింది.
కొంతకాలంగా చత్తీస్గడ్ అటవీ ప్రాంతాలలో సంఘ్ స్పూర్తితో వనవాసి కళ్యాణ పరిషత్ విస్తారంగా పనిచేస్తోంది. ఆదివాసీల అసలైన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతోపాటుగా,, అక్కడ ప్రజలకు విద్య వైద్యం వంటి విషయాల్లో సేవలను అందిస్తోంది. అద్భుతమైన కళ్యాణ పరిషత్ సేవలను గమనించిన అరవిందనేతమ్ స్వయంగా ముందుకు వచ్చారు. అనేక సంవత్సరాలుగా సంఘ్ సేవలను ప్రజల్లోకి బాగా తీసుకొని వెళ్తున్నారు.
ఆర్ఎస్ఎస్ లో కార్యకర్త వికాస వర్గ ముగింపు ఉత్సవం అనేది ఒక అతిపెద్ద కార్యక్రమంగా చెప్పవచ్చు. నాగపూర్ కేంద్రంగా సర్ సంఘచాలక్ గారితో వేదిక పంచుకునే అరుదైన అవకాశం. ఈ అవకాశాన్ని అందుకుంటున్న గిరిజన నాయకులు అరవింద నేతమ్ ను అంతా అభినందిస్తున్నారు.