మద్యం అక్రమాలకు సంబంధించి జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టీం కు చుక్కెదరయింది. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిమీద ఢిల్లీ హైకోర్టు ప్రాథమిక విచారణ చేపట్టింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన ప్రొసీడింగ్స్ దాఖలు చేయడానికి
.. కేజ్రీవాల్ కు స్తోమత ఉందని హైకోర్టు అభిప్రాయ పడింది. అటువంటి అప్పుడు ఆయన టీం తరఫున బయట వ్యక్తులు పిటిషన్ వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అందుచేత ఈ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది . తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ తో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కు చట్టబద్ధంగా అన్ని సౌకర్యాలు అందుతున్నాయని న్యాయస్థానం వివరించింది. జుడిషియల్ ఆదేశాలను ఆయన పాటిస్తున్నారని స్పష్టం చేసింది.