ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కొందరు యూట్యూబర్లను అరెస్ట్ చేసి గంటలపాటు అర్థనగ్నంగా స్టేషన్లో నిలబెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 2న మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. దాదాపు 18 గంటలపాటు వారిని అలాగే లాకప్ లో ఉంచారు పోలీసులు. బట్టలు ఊడదీయించి తీవ్రంగా కొట్టారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడని, దుర్భాషలాడాడని స్థానిక రాజకీయ నాయకుల ఫిర్యాదులతో థియేటర్ ఆర్టిస్ట్ నీరజ్ను ఏప్రిల్ 2న అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టు తర్వాత నీరజ్ తల్లిదండ్రులు మరికొందరు థియేటర్ ఆర్టిస్టులు సహా స్థానికులతో కలిసి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. కనిష్క్ అనే స్థానిక యూట్యూబ్ ఛానెల్ mpsandeshnews24ని నడుపుతున్నాడు, అలాగే న్యూస్ నేషన్ మీడియా ఛానెల్కు ఇన్పుట్లను కూడా అందిస్తాడు. పట్టుకున్న వాళ్లలో జర్నలిస్టులు ఎవరూ లేరని, దుండగులు మాత్రమేనని.. వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత అరెస్టు చేశామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఏప్రిల్ 3న వారు బెయిల్ పై విడుదలైనట్టు తెలిసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)