హైదరాబాద్ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన ఘటనకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఘటన తాలూకు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితులైన మహమ్మద్ యూసఫ్, మహమ్మద్ ఇస్మాయిల్ వరుసకు తండ్రీ కొడుకులు కాగా, మహమ్మద్ యూసఫ్ హైదరాబాద్ భవానీనగర్ ప్రాంతంలో బీఫ్ వ్యాపారం చేస్తున్నాడు. కొడుకు మహమ్మద్ ఇస్మాయిల్ అతనికి సహాయంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో నిందితులిద్దరూ మంగళవారం ఉదయం నల్గొండ జిల్లాలో కొన్ని పశువులను, దూడలను ఖరీదు చేశారు. అనంతరం వాటిని అనుమతి లేకుండా, పరిమితికి మించి TS 07 UE 5570 నెంబర్ గల బొలెరో వాహనంలో అక్రమంగా హైద్రాబాదుకు తరలిస్తుండగా అటుగా, సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో మీర్పేట్ సమీపంలోని గాయత్రీనగర్ వద్ద కోటి మయూరేష్ అనే విద్యార్థి గమనించి వాహనాన్ని ఆపాల్సిందిగా కోరాడు. అందుకు నిందితులు నిరాకరించి, వేగంగా పారిపోతుండగా, మయూరేష్ తన స్నేహితులతో కలిసి ఇన్నోవా వాహనంలో నిందితులను వెంబడిస్తూ హిందూస్తాన్ మార్బల్స్ వద్ద అడ్డుకున్నాడు. దీంతో నిందితులిద్దరూ వాహనం నుండి బయటకు వచ్చి, యువకుడిని తీవ్రంగా దుర్భాషలాడుతూ, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు.
దీంతో యువకులు తప్పించుకునేందుకు లోకి చేరుకోగా, అప్పటికే అక్కడికి చేరుకున్న నిందితులు, మరికొందరిని చేరదీసి అందరూ కలిసి హనుమాన్ మందిరం ప్రాంగణంలోకి చొరబడ్డారు.
ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇస్లాం మతానికి చెందిన నిందితులు, హిందూ యువకులను మారణాయుధాలతో వెంబడిస్తూ హనుమాన్ మందిరంలోకి చేరుకోవడంతో స్థానిక హిందువులు ఈ ఘటనపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారిని శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కొందరు పోలీసులు గాయపడ్డారు.
ప్రస్తుతానికి పరిస్థితి అందుబాటులో ఉందని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ గస్తీ ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని, సోషల్ మీడియా ద్వారా ఎలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయరాదని కోరారు.
ఘటనలో అరెస్ట్ అయిన వారి పేర్లు ఈ క్రింద ఉన్నాయి:
1. మహమ్మద్ యూసుఫ్ (50)
2. మహమ్మద్ నిస్సార్ (19)
3. మహమ్మద్ నవాజ్ (23)
4. మహమ్మద్ గౌస్ (23)
5. మహమ్మద్ అయూబ్ (21)
6. మహమ్మద్ మోసిన్ కమాల్ (35)
7. సౌదామిని లింగమయ్య (26)
ఘటనకు సంబంధించి మరో నలుగురు నిందితులు సోహైల్, సోహెల్, హుస్సేన్, అక్బర్ పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితులందరినీ కోర్ట్ ఎదుట హాజరుపరిచి రిమాండుకు తరలించారు. నిందితుల దాడితో తీవ్రంగా గాయపడిన యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను యుగ తులసి ఫౌండేషన్ సంస్థ వారికి అప్పగించారు.
Courtesy :- NijamToday
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)