ప్రియుడికోసం అక్రమంగా భారతభూభాగంలోకి వచ్చిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల కృష్ణమండల్ అనే యువతి పశ్చిమ బెంగాల్కు చెందిన తన ప్రియుడికోసం సుందర్బన్ గుండా సరిహద్దు దాటింది. ఆన్లైన్లో వారిమధ్య ప్రేమ వికసించింది.
ఫేస్బుక్ ద్వారా అభిక్ మండల్ను ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు . అతనికోసం ఏకంగా ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దును దాటింది.
అసలైతే అభిక్ ఆమెకోసం వెళ్దామనుకున్నాడు. అయితే బంగ్లాదేశ్కు వెళ్లడానికి పాస్పోర్ట్ లేదు.మరో మార్గం లేకపోవడంతో.. కృష్ణ మండల్ అక్రమంగా సరిహద్దును దాటడానికి నిర్ణయించుకుంది. సుందర్బన్ గుండా ఒంటరిగా నడవడం ప్రారంభించింది. బెంగాల్లో పులులు అంతరించిపోతున్న మార్గం ద్వారా అడవిలోకి, అక్కడినుంచి మాల్టా నదిని ఈదుకుంటూ వచ్చింది.
గంటప్రయాణం తర్వాత మండల్ రాష్ట్రంలోని కైఖలి గ్రామంలోకి ప్రవేశించింది. ఎట్టకేలకు ఆమె తన ఆన్లైన్ ప్రేమికుడు అభిక్ మండల్ను నరేంద్రపూర్లోని రానియాలో కలుసుకుంది. మండల్ తనతో పాటు కారు తీసుకుని కోల్కతాలోని కాళీఘాట్ ఆలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.కృష్ణ మండల్ ప్రేమను,తెగువను అందరూ అభినందిస్తున్నారు.
అయితే ఆ యువతి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిందన్న వార్త పోలీసులకు చేరింది. దాంతో నరేంద్రపూర్ పోలీసులు యువతిని అరెస్టు చేశారు. మహిళను బంగ్లాదేశ్ హైకమిషన్కు అప్పగించే అవకాశం ఉంది.