భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. మూడు రోజుల పాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నగరంలోనే ఉండనున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో బీజేపీ నేతలు వరుస పర్యటనల ద్వారా హల్ చల్ చేశారు. నిన్న కే.లక్ష్మణ్ కు రాజ్యసభ సీటును ఖరారు చేశారు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. దేశం నలుమూలల నుంచి కాషాయనేతలు ఈ సమావేశానికి తరలి రానున్నారు. పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిందని దీన్నిబట్టి అర్థమవుతోందనిపార్టీ శ్రేణులు ఉత్సాహంగా చెబుతున్నాయి.
నగరంలోని నోవొటెల్ హోటల్ లో ఈ సమావేశం జరగనుంది, ఇందులో మొత్తం 300 మంది ప్రముఖులు పాల్గొనున్నారని.. వారికి హోటల్ లో విదాటి ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ, షా ల తోపాటు బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు.