దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లు కనిపించకపోవడాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కార్లులో భారీ ఎత్తున్న డబ్బు తరలించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అయితే, మిస్సైన కార్లను ఆడీ ఏ4(WB02AB9561), హోండా సిటీ(WB06T6000), హోండా సీఆర్వీ(WB06T6001), మెర్సిడెస్ బెంజ్(WB02AE2232) కార్లుగా ఈడీ వర్గాలు గుర్తించాయి. పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ఎస్ఎస్సీ స్కామ్లో మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆయన సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. అర్పితకు చెందిన చినార పార్క్ ఏరియాలోని ఫ్లాట్లో రూ.28 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా.. అవినీతి, అక్రమార్జన ఆరోపణల నేపథ్యంలో పార్థ ఛటర్జీకి టీఎంసీ బిగ్ షాకిచ్చింది. పార్థ ఛటర్జీని మంత్రివర్గం నుంచి తొలగించారు.